వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరారు.
నగరంలోని 37వ డివిజన్ నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన గద్దల పవన్, కలకోట్ల ఇంద్రసేన, డీవైఎఫ్.ఐ ఖిలా వరంగల్ మండల అధ్యక్షుడు గద్దల భిక్షపతితో పాటు 50 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉండి ఆదుకుంటామన్నారు.