ములుగురూరల్, ఫిబ్రవరి 13 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా దేశ నలుమూల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి హాని కలుగకుండా గట్టమ్మ తల్లికి నేడు ఆదివాసీ నాయక్పోడ్లు ఎదురుపిల్ల పండుగను ఘ నంగా నిర్వహించనున్నారు. జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుంచి 30 లక్ష్మీదేవరలు నేడు ములుగు గట్టమ్మ తల్లి వద్దకు చేరుకోనున్నా యి. బుధవారం ఉదయం ఆదివాసీ నాయక్పోడ్ పూజారులు, వారి కుటుంబ సభ్యులు ఆలయాన్ని శుద్ధి చేసి మామిడి తోరణాలు, బంతి పూలతో అలంకరించనున్నారు. అనంతరం ఆలయం సమీపంలో ఉన్న గుట్ట నుంచి కంకవనాన్ని తీసుకొచ్చి గట్టమ్మ ఆల యం ఎదుట, ఆలయ ఆవరణలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దెలపై అమర్చనున్నారు.
అనంతరం ఇండ్లకు చేరుకొని ఆదిదే వతకు బెల్లం అన్నంతో వండిన 101 బోనాలతో ములుగులోని ఆదివాసీ నాయక్పోడ్ క మ్యూనిటీ హాల్ వద్దకు చేరుకుంటారు. ఐదు లక్ష్మీదేవరలను తీసుకొచ్చి కుల పెద్దమనిషి, ఆలయ ప్రధాన పూజారి కొత్త సదయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్ష్మీదేవరలకు చీరె, సారె, పోకవక్క, గాజులు, పసుపు, కుంకు మ, తమలపాకు, సోడు బియ్యం సమర్పిస్తా రు. అనంతరం వెయ్యి నుంచి 2వేల మంది ఆదివాసీ నాయక్పోడ్లు వారి ఆచార, సంస్కృతి, సంప్రదాయాల నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య రెండున్నర కిలోమీటర్ల దూ రంలో ఉన్న గట్టమ్మ వద్దకు చేరుకోనున్నారు. బోనాలతో ఆలయం చుట్టూ మూ డు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన అనంతరం గొర్రె పిల్లను ఎదురుపిల్లగా గట్టమ్మ తల్లికి బలి ఇవ్వనున్నారు.