హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగిన మహాశివరాత్రి ( Maha Shivaratri ) బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 9 హుండీ ( Hundi ) ల లెక్కింపు శనివారం నిర్వహించారు.
ఆలయ నాట్య మండపంలో దేవాదాయ శాఖ పరిశీలకుడు ప్రసాద్, ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.అనిల్కుమార్( EO Anil Kumar ) పర్యవేక్షణలో వెంకటేశ్వర సేవా సమితి మహిళా సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేందర్శర్మ, ఆలయ సిబ్బంది మధుకర్, రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రెండు లక్షల రూపాయల ఆదాయం పెరిగింది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.27,44,268 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు. గత సంవత్సరం రూ.25,37,000 రాగా ఈ సంవత్సరం రూ.2,07,268 ఆదాయం పెరిగిందని కార్యనిర్వాహణ అధికారి అనిల్కుమార్ తెలిపారు.