ములుగు, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): మేడారం మహాజాతర కు భక్తుల సౌకర్యార్థం పర్యాటకశాఖ హెలికాప్టర్ సేవలు ఈసారి కూడా ప్రారంభించనున్నది. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారానికి భక్తులను తరలించి దర్శనం తర్వాత తిరిగి హనుమకొండకు తీసుకెళ్లేలా ప్యాకేజీలను రూపొందిస్తున్నది. 2016 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
గత జాతరలో ఒక్కొక్కరికి రూ.4వేలు వసూలు చేశారు. ప్రస్తుతం ప్రైవేట్ ఏవియేషన్ ద్వారా టికెట్ ధర నిర్ణయించనున్నారు. మేడారంలో హెలికాప్టర్లు దిగేందుకు ఇప్పటికే మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. జాతర పరిసర ప్రాంతాలను విహంగ వీక్షణం చేసేందుకు కూడా త్వరలో ప్యాకేజీలను ప్రకటించనున్నారు.