కష్టపడి పోరాడితే సాధించనిది ఏదీ లేదని నిరూపించారు.. లక్షల మంది పోటీలో ఉన్నా ఇవేవి వారి విజయాన్ని ఆపలేదు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధించడమే గగనం.. అలాంటిది ఒక్కరే రెండు, మూడు.. మరొకరు ఐదు కొలువులు ఏకకాలంలో సాధించి శభాష్ అనిపించుకుంటున్నారు. నిరుద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ములుగురూరల్, మార్చి 2 : మండలంలోని మహ్మద్గౌస్పల్లి గ్రామానికి చెందిన వేములపల్లి అభిషేక్ కుమార్ ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో గురుకుల జూనియర్ లెక్చరర్ పోస్టుతో పాటు గురుకుల టీజీటీగా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా అభిషేక్కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువుల ప్రొత్సాహంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించినట్లు తెలిపారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగంలో చేరనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రేగొండ,(గోరికొత్తపల్లి) మార్చి 2 : జయశంకర్ జిల్లా గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేటకు చెందిన మాజీ ఎంపీపీ సామాల రాజిరెడ్డి, లక్ష్మి దంపతులు కూతురు సునీతారెడ్డి. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యింది. జగ్గయ్యపేటకు చేందిన సునీతారెడ్డి హనుమకొండలో నివాసం ఉంటూ ప్రైవేట్ విద్యా సంస్థలో లెక్చరర్గా పని చేస్తూ భర్త రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతో మూడు ఉద్యోగాలు సాధించింది. కామర్స్ జూనియర్ లెక్చరర్గా రాష్ట్రస్థాయిలో 32వ ర్యాంక్, పీజీటీలో 36వ ర్యాంక్, టీజీటీ ఉద్యోగాలకు ఎంపికయ్యింది. సునీతరెడ్డిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
ఇనుగుర్తి మార్చి 2 : ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో పట్టుదలతో చదివి ఓ యువకుడు ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. మండలంలోని చిన్ననాగారానికి చెందిన నిడిగంటి సునీల్ పట్టుదలతో చదివి సర్కారు కొలువులు కొట్టాడు. శుక్రవారం రాత్రి విడుదలైన గురుకులం టీజీటీ ఫలితాల్లో భౌతికశాస్త్రంలో రాష్ట్ర స్థాయి 25వ ర్యాంక్, జనరల్ సైన్స్లో రాష్ట్ర స్థాయి 50వ ర్యాంక్ సాధించి రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రణాళికతో 2 సంవత్సరాలు చదివి ఉద్యోగాలు సాధించానని సునీల్ తెలిపాడు. సునీల్కు కుటుంబ సభ్యులు మిఠాయిలు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.
బయ్యారం, మార్చి 2 : ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్న ఓ పేదింటి యువకుడి పదేండ్ల కల నెరవేరింది. మండల కేంద్రంలోని బచ్చలి బజార్కు చెందిన కొండూరి వెంకన్న ఎంఏ, బీఈడీ పూర్తి చేసి ప్రైవేట్ లెక్చరర్గా పని చేస్తున్నాడు. గతంలో రెండుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు వెళ్లి 1: 2 కారణంగా ప్రభుత్వ కొలువు సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా మూడో ప్రయత్నంలో జోన్-4 (ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ) బీసీ- ఏ, ఓపెన్ కేటగిరీలో ఏడు ఉద్యోగాలు ఉండగా టీజీటీగా ఉద్యోగం సాధించడం విశేషం. పదేండ్ల పాటు కొలువు కోసం నిరీక్షణకు తెర పడడంతో వారి కుటుంబ సభ్యుల అనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తొర్రూరు : తొర్రూ రు మండలంలోని సోమారం గ్రామానికి చెందిన నిరుపేద కు టుంబానికి చెందిన ఎనమాల మౌనిక ఒకేసారి నాలుగు ఉ ద్యోగాలు సాధించిం ది. గత సంవత్సరం లో నిర్వహించిన నెట్, జేఆర్ఎఫ్, సెట్ వంటి అర్హత పరీక్షల్లో ప్రతిభను చాటింది. గురుకుల పాఠశాల డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీల పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులతో నాలుగు ఉద్యోగాలు సాధించింది. మౌనికను తల్లిదండ్రులు, గ్రామస్తులు, బంధువులు, స్వీట్లు తినిపించి పూలమాలు, శాలువాలతో సన్మానించారు.
తొర్రూరు : శిల్ప తన ఏడాది చంటి పాప అలనా పాలనా చూస్తూ ఉద్యోగం సాధించి కష్టే ఫలి అని నిరూపించింది. మండలంలోని గు ర్తూరు గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన పంజాల కుమారస్వామి, రా జ్యలక్ష్మి దంపతుల కుమార్తె పంజాల శిల్పకు మూడేళ్ల క్రితం వివాహం చేశారు. అనంతరం పాప జన్మించినా పట్టుదలను వదలకుండా చదివి టీజీటీలో స్టేట్ 23వ ర్యాంక్ సాధించి తెలుగు టీచర్గా ఎంపికవడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తల్లిదండ్రు లు, భర్త, గ్రామస్తులు ఆమెకు స్వీట్లు తినిపించి అభినందించారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 2 : హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్ పల్లెర్ల శంకరయ్య కూతురు పల్లెర్ల రసజ్ఞ ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. మొదటినుంచి చదువులో చురుకైన విద్యార్థినిగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి డిగ్రీ పీజీ(కెమిస్ట్రీ 2019లో), ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో 2022 మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. విద్య, పరిశోధన నిమిత్తం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశవ్యాప్తంగా నిర్వహించే సీఎస్ఐఆర్ యూజీసీ నెట్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(కెమికల్ సైన్స్) 2019లో యూజీసీ నెట్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ 2023లో) సాధించారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పీహెచ్డీ ప్రొఫెసర్ పి.సరితారెడ్డి పర్యవేక్షణలో చేస్తూ, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గురుకుల నియామక బోర్డు వారు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించారు.
1. రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ, 2. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్, 3. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ లైబ్రేరియన్, 4.పాలిటెక్నిక్ లైబ్రేరియన్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లైబ్రేరియన్, 5.గ్రూప్-4 సర్వీసెస్లో మొత్తం ఐదు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 2 : కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన జోగు శ్రీకాంత్. పట్టు వీడకుండా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కన్నకలలు నిజం చేశాడు. శ్రీకాంత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. ప్రభుత్వ కాలేజీలో ఇంటర్, డిగ్రీ, ఉస్మానియాలో పీజీ, బీఎడ్ పూర్తి చేసి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గురుకులాల్లో టి.డి.టి సైట్ జనరల్ సైన్స్ విభాగంలో మొదటి స్థానం, పి.జి.టి ఫిజికల్ సైన్స్ విభాగంలో స్టేట్ 8వ ర్యాంకు, జె.ఎల్ కెమిస్ట్రీ 13వ ర్యాంకు అంతటితో ఆగకుండా ఇటీవల ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లలో గ్రూప్-1 సాధించే దిశగా ముందుకు సాగుతున్నాడు. ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 2 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్-1 పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఎంపీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా తమ దరఖాస్తులను హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్లో అందజేయాలని కోరారు. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలన్నారు. డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందని, వివరాలకు 0870-2571192, 040-24071178, 27077929 సంప్రదించాలని కోరారు.