ములుగురూరల్, డిసెంబర్13: గురివింద గింజలు ఎప్పుడైనా చూశారా.. దాని ముందు భాగమంతా ఎరుపుగా ఉండి వెనుక వైపున ఓ నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. అందుకే దీన్ని తన నలుపెరుగని గురువింద గింజ అంటారు. ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఇవి పూర్వం అందరి నోళ్లలో నానేవి. ఇవి ములుగు మండలం భూపాల్నగర్-మల్లంపల్లి మధ్యలో ఉన్న జాతీయ రహదారి వెంట ఉన్న చెట్టుకు విరగకాయగా ‘నమస్తే తెలంగాణ’ క్లిక్మనిపించింది. ఎరుపు, నలుపు రంగుల్లో ఉండే ఈ గురివింద గింజలు చెట్టు తీగకు విరగకాసి దర్శనమిచ్చాయి. ఎనుకటి రోజుల్లో వీటిని బంగారాన్ని తూకం వేసేందుకు వాడేవారు. గొప్పలు చెప్పుకునే వారిని గురివింద గింజతో పోల్చే సామెత కూడా నేటికీ ఆచరణలో ఉన్నది.