రాయపర్తి, డిసెంబర్ 14: దివ్యాంగ విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మన్యూనతా భావాలకు లోనుకాకుండా ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో రాణించాలని సీఆర్టీలు టీ ప్రవీణ్కుమార్, జీ కిరణ్కుమార్ కోరారు. కాట్రపల్లి జడ్పీహెచ్ఎస్లోని భవిత సెంటర్లో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు అత్యంత ప్రతిభావంతులన్నారు. దివ్యాంగుల్లో కేవలం అవయవ లోపాలు ఉంటాయే తప్ప.. ప్రతిభాపాటవాలు, సృజనాత్మక శక్తుల్లో ఎలాంటి తేడాలు ఉండవని గుర్తుచేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దివ్యాంగులపై ప్రేమపూర్వక భావాన్ని ప్రదర్శించాలని కోరారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు పలు ఉపకరణాలను అందజేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమలో ప్రధానోపాధ్యాయులు కిశోర్, సమ్మయ్య, రజిని పాల్గొన్నారు.
పథకాలను వినియోగించుకోవాలి
చెన్నారావుపేట: ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో రత్నమాల అధ్యక్షతన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీవో ప్రకాశ్ హాజరై మాట్లాడుతూ దివ్యాంగులు ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని సూచించారు. ఎంఈవో రత్నమాల మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఈఆర్పీలు శ్రీనివాస్, రాజేశ్, ఉపాధ్యాయులు రవి, ఫ్లోరెన్స్, సీఆర్పీలు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలి
దుగ్గొండి: దివ్యాంగులు అధైర్య పడకుండా ఆత్మైస్థెర్యంతో ముందుకెళ్లాలని ఎంఈవో చదువుల సత్యనారాయణ సూచించారు. మండలకేంద్రంలోని మండల వనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలు, దివ్యాంగ విద్యార్థులకు ఆటపాటల పోటీలు నిర్వహించి, ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. దివ్యాంగ విద్యార్థులు ఫిజియోథెరపీని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ తోకల మంజులా నర్సింహారెడ్డి, హెచ్ఎంలు ప్రవీణ్కుమార్, సతీశ్, పిజియోథెరపిస్ట్ స్వాతి, ఐఈఆర్పీలు రవి, సంజీవ్కుమార్, గీత, కృష్ణ పాల్గొన్నారు.