జననేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్లు కట్చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలు, సమావేశాల్లో రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ చేస్తున్న సేవలను వక్తలు కొనియాడారు.
కరీమాబాద్/నర్సంపేట, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా వరంగల్ శంభునిపేట జంక్షన్లో రిషినంద్ మెమోరియల్ ట్రస్టు చైర్మన్ కొల్లూరి యోగానంద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధితో దేశం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ గుండా ప్రకాశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, మెట్టు శ్రీనివాస్, హరి రమాదేవి, రాజనాల శ్రీహరి, మాజీ కార్పొరేటర్ బాసాని శ్రీనివాస్, కొల్లూరి యోగానంద్, మండల పరశురాములు, మందా శ్రీనివాస్, గండ్రాతి కుమార్, బైరి రామేశ్వర్ పాల్గొన్నారు. అలాగే, 41వ డివిజన్ ఎస్సీకాలనీలో ఈదుల రమేశ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పోశాల పద్మ కేక్ కట్ చేసి మాట్లాడారు.
ఉద్యమనేత కేసీఆర్ జాతీయ రాజకాయాల్లోనూ రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బజ్జూరి రవి, శంకేశి లింగమూర్తి, ఈదుల భిక్షపతి పాల్గొన్నారు. అంతేకాకుండా మామునూరులో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ మొక్కలు నాటారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు అరుణ, ఇండ్ల నాగేశ్వర్రావు, నోముల వెంకట్రెడ్డి, మేకల రాణి, జమీరొద్దీన్, మెప్మా సిబ్బంది రమేశ్, శ్రీలత పాల్గొన్నారు. కరీమాబాద్ ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు మేడారంలో కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. మాజీ కార్పొరేటర్ నాగపురి కల్పన, నాయకులు నాగపురి సంజయ్బాబు, వంగరి కోటి, పూదరి అజయ్, పొగాకు సందీప్, నాగపురి అశోక్ పాల్గొన్నారు. నర్సంపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేసీఆర్ అభిమానులు ఆలయాల్లో పూజలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు చేశారు.
ఖానాపురం: మండలవ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మండలకేంద్రంలోని హనుమాన్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, మసీదులో ప్రార్థనలు, చర్చిలో కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఎంపీపీ కొనియాడారు. జడ్పీటీసీ బత్తిని స్వప్న, మాజీ ఏఎంసీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్రావు, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, ఎంపీటీసీలు మర్రి కవిత, రామస్వామి, బోడ భారతి, పూలు, కే పూర్ణచందర్రావు, రమేశ్, పూర్ణచందర్, అశోక్ పాల్గొన్నారు.
దుగ్గొండి: మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్లు కట్ చేసి పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. దుగ్గొండిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పెద్ది పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, ఆర్బీఎస్ కో ఆర్డినేటర్ తోకల నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, క్లస్టర్ ఇన్చార్జిలు, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు. గిర్నిబావి ఎంజేపీటీ గురుకుల విద్యాలయంలో ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాద్యాయులు కేసీఆర్ ఆకృతి కూర్చుని సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నల్లబెల్లి: ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ ఆధ్వర్యంలో రామాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పార్టీ గ్రామ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, సర్పంచ్ నానెబోయిన రాజారాం, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, నాయకులు సట్ల శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ మామిండ్ల మోహన్రెడ్డి, ఇట్టె కృష్ణారెడ్డి, గుండాల కుమారస్వామి, నన్నెసాహెబ్, సుభాష్, నరహరి పాల్గొన్నారు.
రాయపర్తి: ఎంపీడీవో కార్యాలయంలో టీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, వర్ధన్నపేట సీఐ జీ సదన్కుమార్, ఎస్సై బండారి రాజుతో కలిసి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ ప్రారంభించి మాట్లాడారు. రాష్ర్టాన్ని సాధించి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడువాలని పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని పల్లెప్రకృతి వనంలో సర్పంచ్ గారె నర్సయ్య మొక్కలు నాటారు. పెర్కవేడు జీపీ ఆవరణలో సర్పంచ్ చిన్నాల తారాశ్రీ-రాజబాబు నేతృత్వంలో పూల మొక్కల వద్ద కేక్ కట్ చేశారు. ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, నాయకులు పూస మధు, కుందూరు రాంచంద్రారెడ్డి, జక్కుల వెంకట్రెడ్డి, బొమ్మెర వీరస్వామి, బిల్ల సుభాష్రెడ్డి, కుక్కల భాస్కర్, చెడుపాక కుమారస్వామి, అయిత రాంచందర్, ముత్తడి సాగర్రెడ్డి, తాళ్లపల్లి సంతోష్గౌడ్, సుధాకర్యాదవ్, అశ్రఫ్ పాషా, ఎల్లస్వామి, మోహినొద్దీన్, సతీశ్, కిరణ్, షేరాజ్పాషా, జీ శేఖర్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: వరంగల్ 17వ డివిజన్లోని బొల్లికుంటలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తీ భూమాతారామస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని శివకేశ ఆలయంలో పూజలు చేశారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సోల్తీ నరేందర్, మహిళా సంఘాల ప్రతినిధులు చీకటి సరిత, చిర్ర మమత, సమ్మక్క, సుజాత, సతీశ్, ప్రేమ్కుమార్, రాజేశ్, టోని, రాజు, రవీందర్, శ్రీధర్, క్రాంతికుమార్, రణధీర్, నగేశ్ పాల్గొన్నారు.
నెక్కొండ: మండలకేంద్రంలోని తెలంగాణ రెసిడెన్సియల్ గురుకులం ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము ఆధ్వర్యంలో వనప్రేమికుడు నల్లగొండ సమయ్యతోపాటు ప్రిన్సిపాల్ రాజేశ్వరి, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్యాదవ్, ఆర్బీఎస్ జిల్లా సభ్యులు చెన్నకేశవరెడ్డి, ఉప సర్పంచ్ వీరభద్రయ్య, పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి, నాయకులు గుంటుక సోమయ్య, తాటిపల్లి శివకుమార్, ఈదునూరి యాకయ్య, ఈదునూరి రమేశ్, జే వేణగోపాల్, రావుల భాస్కర్రెడ్డి, యాకాంతం, శ్రీనివాస్, ఖలీల్, శ్యామ్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్: మాదన్నపేట పెద్ద చెరువు కట్టపై ఉన్న శివాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజలు చేశారు. సీఎం కేసీఆర్ పేరిట అర్చన, అభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు మొలుగూరి చంద్రమౌళి, గొడిశాల రాంబాబు, గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, టీఆర్ఎస్ బీసీసెల్ మండల అధ్యక్షుడు పెండ్యాల సదానందం, మోతె పద్మనాభరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మచ్చిక నర్సయ్యగౌడ్, కట్ల సుదర్శన్రెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ చాంద్పాషా, మహిళా కమిటీ మండల అధ్యక్షురాలు పాల్తియ సరస్వతి, పత్రి కుమారస్వామి, న్యాయవాది మోటూరి రవి, నాయకులు అల్లి రవి, పిన్నింటి దేవేందర్రెడ్డి, గంధం జగన్మోహన్రెడ్డి, వల్లాల కరుణాకర్, కడారి కుమారస్వామి, సాంబరాజ్య, జఫార్, లక్ష్మణ్, గోవర్ధన్, భాస్కర్ పాల్గొన్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురం మైనార్టీ గురుకులంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, వార్డు కౌన్సిలర్ బోడ గోల్యానాయక్తోపాటు పలువురు నాయకుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి, టీచర్లు పాల్గొన్నారు.
మట్టెవాడ: పోచమ్మమైదాన్లోని సాయిబాబా ఆలయంలో కార్పొరేటర్ బస్వరాజు శిరీషాశ్రీమాన్ ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఎండీ మస్తాన్, జన్ను శ్యాం, ఎస్ రాజు, ఆర్ శివకృష్ణ, సాయిశ్రవణ్యాదవ్, ఇమ్రాన్ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ కాశీబుగ్గలోని శ్రీసాయి నర్సింగ్ హోంలో కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించారు. డాక్టర్ గుండాల మదన్కుమార్ కేక్ కట్ చేసి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో డాక్టర్ భారతి పాల్గొన్నారు.
కాశీబుగ్గ: రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వరంగల్ 14వ డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన, తూర్పాటి సారయ్య, ముడుసు నరసింహ, గండ్రాతి భాస్కర్, జన్ను అనిల్, గంధం గోవిందు, పీ రాజపోశాలు, సుభాష్, సలీం, రాజేందర్, బీ శంకర్, పీ యాదగిరి, కృష్ణ పాల్గొన్నారు.