వరంగల్, మార్చి 20: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లతో హనుమకొండ ఆర్టీఏ కార్యాలయం కళకళలాడుతోంది. వాహన రిజిస్ట్రేషన్దారులతో రద్దీగా ఉంది. ఉదయం 10 గంటల నుంచే వాహన రిజిస్ట్రేషన్ల కోసం క్యూలు కడుతున్నారు.
ఇటీవల రాష్ట్ర ప్ర భుత్వం టీఎస్ స్థానంలో టీజీ తీసుకొచ్చి కొత్త నంబర్లను కేటాయిస్తున్న తరుణంలో వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం క్రేజీ చూపిస్తున్నారు. మొదటి రోజు టీజీ 0001, 0006, 0009, 0036 నంబర్ల కోసం వాహనదారులు పోటీలు పడ్డారు. చివరికి బిడ్డింగ్ ద్వారా రూ. లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకున్నారు.