నాగర్కర్నూల్, నమస్తే తెలంగాణ/ కొల్లాపూర్, సెప్టెంబర్ 16 : నాడు వలసలు, గంజి కేంద్రాలతో తల్లడిల్లిన పాలమూరు.. నేడు కర్నూల్, బెంగళూరు ప్రాంతాల నుంచి కూలీలను తెచ్చుకొని పని చేయించుకునే స్థితికి ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉమ్మడి పాలమూరు రూపురేఖలు పూర్తిగా మారిపోయాని, తాను ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ కల సాకారమైతే పాలమూరు కీర్తి చరిత్రలో నిలిచిపొతుందని భావించానన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అంజనగిరి లిఫ్ట్ను శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్ శివారులో నిర్వహించిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతలతో తెలంగాణ అద్భుతంగా మారుతున్నదన్నారు. పాలమూరు ప్రాజెక్టు నాలుగేండ్ల క్రితమే పూర్తయ్యేదని, రాజకీయ నాయకుల వల్లే జాప్యం జరిగిందన్నారు. జూరాలకు అప్పటి సీఎం అంజయ్య భూమిపూజ చేస్తే నాయకులు పనులను అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆర్డీఎస్ను నాశనం చేశారని, జోగుళాంబ అమ్మవారి పాదాలకు మొక్కి తాను పాదయాత్ర ప్రారంభించానన్నారు.
ఆర్డీఎస్ను రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్రెడ్డి బాంబులతో బద్దలు కొడతానంటే.. నిలువుగా నిలబడితే వంద బాంబులు వేస్తామని హెచ్చరించగా జర్నలిస్టులు సైతం ప్రశంసించారని గుర్తు చేసుకున్నారు. పాలమూరుకు ఇంటి దొంగలే ప్రాణగండమయ్యారని విమర్శించారు. అప్పటి సీఎంలను చూస్తే లాగులు తడిసిపోయేవన్నారు. పాలమూరు నీళ్లు తాండవం చేస్తుంటే మనసు పుకలరించిందని, తన జీవితం ధన్యమైందని ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ నాయకులకు సిగ్గు, శరం ఉంటే కృష్ణానదిలో నీటి వాటా తేల్చాలని డిమాండ్ చేశారు. నాటి పాలకులు పాలమూరును దత్త తీసుకొని దగా చేశారని దుయ్యబట్టారు. కరివెన గుట్టలపై మూడు రోజులు తిరిగామని, నెట్టంపాడ్, కేఎల్ఐ ప్రాజక్టులను పాలమూరు ప్రజల ఆశీస్సులతో పూర్తి చేసుకున్నామన్నారు. 70 ఏండ్ల పాటు పాలమూరును పట్టించుకోలేదని, కేఎల్ఐ, పీఆర్ఎల్ఐలను పెండింగ్లో పెట్టింది చంద్రబాబు కాదా? కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రావడంతో పాలమూరులో ఐదు, నిన్న తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించామన్నారు.
ఏడాదిలో పదివేల మంది డాక్టర్లను తయారు చేస్తున్నామన్నారు. గతంలో పాలమూరు నుంచి ముంబయికి బస్సుల్లో వలస వెళ్లేవారని గుర్తుచేశారు. కవి గోరటి వెంకన్న పాలమూరుపై పాట రాశారని, ఇప్పుడు దుందుభీ నీళ్లతో సవ్వడి చేస్తున్నదన్నారు. పాలమూరులో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన కల, లక్ష్యమన్నారు. తెలంగాణ వచ్చిన రోజు పాలమూరు ఎంత సంతోషంగా ఉందో.. పీఆర్ఎల్ఐ ప్రారంభం రోజున అదేవిధంగా ఉందన్నారు. ప్రజలు ఐకమత్యాన్ని కొనసాగించాలని, ప్రాజెక్టుల పూర్తితో మత్స్య సంపద పెరుగుతున్నదన్నారు. కొల్లాపూర్ పట్టణానికి రూ.25కోట్లు, గ్రామపంచాయితీలకు రూ.15లక్షలు చొప్పున ప్రకటించారు. జిల్దార్తిప్ప, బాచారం, పుసుపుల, మళ్లేశ్వరం లిఫ్ట్లకు హామీ ఇచ్చారు. మహబూబ్నగర్కు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గృహలక్ష్మి పథకంలో నాలుగువేల ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. పాలమూరు తన గుండెలో ఉంటుందన్నారు.
పీఆర్ఎల్ఐ మహాద్భుత విజయం మంత్రి నిరంజన్రెడ్డి
నాగర్కర్నూల్ (నమస్తే తెలంగాణ) సెప్టెంబర్ 16 : పాలమూరు-రంగారెడ్డి పథకం మహాద్భుత విజయమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పీఆర్ఎల్ఐ తొలి పంప్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషకరమన్నా రు. 1948లో అప్పటి ప్రధాని నెహ్రూ భాక్రానంగల్ ప్రాజెక్ట్ను పదిహేను ఏండ్ల పాటు చేపట్టి తొ మ్మిదిలక్షల ఎకరాలకు సాగునీరు అందించారన్నా రు. 2015 జూన్లో కేసీఆర్ చేతుల మీదుగా పను లు ప్రారంభమైన పదేండ్లలోనే పీఆర్ఎల్ఐని పూ ర్తి చేసుకున్నామని వివరించారు. 12.30లక్షల ఎ కరాలకు సాగునీరు అందనుందన్నారు. తెలంగా ణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటే.. వెయ్యిమంది చంద్రబాబులొచ్చినా కట్టితీరుతమని సీ ఎం కేసీఆర్ నిరుపించారన్నారు. ఇంటిదొంగలు అవాంతరాలు కల్పించినా 145 మెగావాట్ల సామ ర్థ్యం ఉన్న నాలుగు లిఫ్ట్లు, ఐదు రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో 45వేలమంది కూలీలు పని చేయగా అందులో పదివేల మంది పాలమూరు బిడ్డలు చనిపోయారని, శ్రీశై లం ప్రాజెక్టుతో 65గ్రామాలు, 42,200 ఎకరాలు మునిగితే ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. సీఎం కేసీఆర్ ఆరేడు గ్రామాలు, 27వేల ఎకరాల భూసేకరణతో 70 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేలా పీఆర్ఎల్ఐని కానుకగా ఇచ్చారన్నారు. జిల్లాలో ఎతైన ఎత్తం గట్టు ఎక్కి చూస్తే పాలమూరు అంతా నీళ్లు జలాశయాలు కనిపిస్తాయన్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడితే క్షమించరు..మంత్రి శ్రీనివాస్గౌడ్
చావడానికైనా సిద్ధపడి తెలంగాణ సాధించిన కారణజన్ముడు సీఎం కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కనీళ్లు పెట్టుకొని పాలమూరు బాగు చేసేందుకు ప్రతిన బూనాడన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ప్రత్యేకంగా నిలిచిందన్నారు. మన నీళ్లు పక్క రాష్ర్టాలకు పోతే తెలంగాణలో ఉన్న కొందరు నాయకులు సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. పాలమూరు బిడ్డలు దుబాయ్, ముంబయి వలస పోతే తాగడానికి నీళ్లు ఇవ్వలేదన్నారు. పీఆర్ఎల్ఐ అందుబాటులోకి వస్తుంటే, కాల్వలు లేవు, రిజర్వాయర్లు లేవు, కరెంటు లేదని కొందరు అంటున్నారని మండిపడ్డారు. ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుందని మంత్రి తెలిపారు. కేసీఆర్ లేకుంటే కేఎల్ఐకు నీళ్లు వచ్చేవి కాదన్నారు. 70 ఏండ్ల పాలనలో పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని మోటర్లను పీఆర్ఎల్ఐలో ఏర్పాటు చేశామన్నారు. నాడు వలసలు పోయిన పాలమూరుకు నేడు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వలసొస్తున్నారని వివరించారు. కేసీఆర్ను నోటికొచ్చినట్లు మాట్లాడితే క్షమించమని హెచ్చరించారు.
కొల్లాపూర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది ఎమ్మెల్యే బీరం
పాలమూరు పేరు ఇకపై చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో కొల్లాపూర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ సభను తలపించేలా సీఎం కేసీఆర్ సభ జరిగిందన్నారు.