ఖిలా వరంగల్/కరీమాబాద్/నెక్కొండ:నల్లబెల్లి/పర్వతగిరి/చెన్నారావుపేట, జనవరి 3 : భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆమె 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పడమర కోట పద్మశాలీ భవనంలో, కరీమాబాద్, నెక్కొండలోని అంబేద్కర్ భవన్లో, తిమ్మాపూర్, నల్లబెల్లి కేజీబీవీలో, పర్వతగిరి, చెన్నారావు పేట, శంభునిపేట, రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రీతి దయాళ్, మైదం సంజీవ, కలకోట్ల కుమారస్వామి, తాళ్ల సావిత్రి, ఎండీ సలీం, పీ హరి ప్రసాద్, ఎం అశోక్, ఐ నగేశ్, మైదం సుచేంద్ర, రవన్న, రాజు, అరుణ, రమాబాయి అంబేద్కర్ ఉమెన్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షురాలు తరాల రాజమణి, మ్యాకల సూరయ్య, చంద్రం, ఇనుగాల జోగిరెడ్డి, మండల సారయ్య, ప్రిన్సిపాల్ శోభాదేవి, వీరాంజన్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాంకాల యాదగిరి, సీనియర్ నాయ కులు కొంగర సూర్యారావు, కందిక చెన్నకేశవులు, ఎం మల్లయ్య, గారె శ్యాంప్రసాద్, వనిత, కేజీబీవీ ప్రత్యేకాధికారి సునీత, ఏబీఎస్ఎఫ్ నాయకుడు నరేశ్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య, మహిళా సంఘం నాయకురాలు పంజా కల్పన, ఆర్ఎస్పీ వరంగల్ జిల్లా కార్యదర్శి వీ కుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు టీ నర్సయ్య, ఏ వెంకటేశ్వర్రావు, దళిత అవార్డు గ్రహీత జంగిలి బాబు, బొట్ల భాస్కర్, వీరభద్రయ్య, అర్షం యాకయ్య, మోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్, నాయకులు రామకృష్ణ, రాజు, పెండ్యాల కృష్ణ, యాదగిరి, కుమార్, చిరంజీవి, చేరాలు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : విద్యతోనే అసమానతలు, వివక్ష తొలగిపోతాయని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలోని ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేయూ బీసీ సెల్ కార్యాలయంలో సంచాలకుడు డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించినసావిత్రిబాయి జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సావిత్రిబాయి మహిళా లోకానికి స్ఫూర్తి అన్నారు. హనుమకొండ జిల్లా ఐద్వా 2024 ప్యాకెట్ క్యాలెండర్ను వీసీ ఆవిషరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఆర్ జయశ్రీ, జిల్లా సహాయ కార్యదర్శి ఎం రమాదేవి, జిల్లా కమిటీ సభ్యులు కే రాధిక, టీ సుచరిత, ఆయేషా యాస్మిన్ పాల్గొన్నారు. మహిళా పీజీ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య, అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా, కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కేయూలో సావిత్రిబాయి జయంతి నిర్వహించారు. గాదె సమ్మయ్య ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ గెస్ట్ ఫ్యాకల్టీ దేవరశెట్టి రజితను సన్మానించారు. ఆచార్యులు సారంగపాణి, సునీత, ప్రియాంక పాల్గొన్నారు. కాగా, నిట్లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో సావిత్రిబాయి జయంతిని ప్రొఫెసర్లు హరికృష్ణ, సతీశ్ బెన్, ప్రణీత, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యదర్శి దిలీప్కుమార్, గుండ కుమార్, సాంబయ్య, టీ భాసర్. వీ నరేందర్, గుండపు రవీందర్, ఏ శ్రీనివాస్, వెంకటేశ్వర్లు నివాళులర్పించారు.
హనుమకొండ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా సంక్షేమాధికారి కే మధురిమ పిలుపునిచ్చారు. సావిత్రిబాయి జయంతి సందర్భంగా 59వ డివిజన్ సుబేదారిలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్పొరేటర్ గుజ్జుల వసంత, శాంతి న్యాయ ఉద్యమాధికారి నదీమ్ బేగ్, టైలరింగ్, మగ్గం టీచర్లు భాగ్య, పద్మ, మాధవి తదితరులు పాల్గొన్నారు.