పాలకుర్తి రూరల్, డిసెంబర్ 27 : ముదిరాజులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం ముదిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాల పండుగకు ఎమ్మెల్సీ బండా ప్రకాశ్తో కలిసి హాజరయ్యారు. బోనమెత్తి మహిళలను ఉత్సాహపరిచారు. ఎమ్మెల్సీతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ముదిరాజు కులస్తులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరిగిందన్నారు. ముదిరాజులకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలోనే పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. ముదిరాజుల సంక్షేమానికి తాను కూడా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి కృషి చేశానన్నారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామగ్రామాన కమ్యూనిటీ భవనాలను మంజూరు చేసినట్లు చెప్పారు. చేప పిల్లలలను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ముదిరాజులు ఐక్యంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్కు అండగా నిలబడాలని సూచించారు. ముదిరాజు కులానికి చెందిన బండా ప్రకాశ్కు ఎంపీగా, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, రిటైర్డ్ కల్నల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ తరాల చంద్రబాబు, వర్రె వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, దాసరి మధు, కాశబోయిన సాయి, దాసరి యాకయ్య, దాసరి క్రాంతి, పసుల వెంకట్, మేడారపు సుధాకర్, జీడి మనోహర్, జీడి మల్లయ్య, చిక్కుడు రాములు, జీడి సమ్మయ్య, మామిండ్ల రమేశ్రాజా, ఎల్లబోయిన కుమార్, దుంపల సంపత్, శోభన్బాబు, ముదిరాజు కులస్తులు తదితరులు పాల్గొన్నారు.