అమ్మవారి దర్శనం కోసం భక్తుల బారులు
వైభవంగా సాగుతున్న దేవీ నవరాత్రోత్సవాలు
వరంగల్, సెప్టెంబర్ 30 : వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో భద్రకాళీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన శుక్రవారం భద్రకాళీ అమ్మవారు రాజరాజేశ్వరీ దేవీ(లలిత) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లుచేశారు. తాగునీటి వసతితో పాటు చలువ పందిళ్లు వేయించారు. భక్తుల కోసం నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆలయంలో బతుకమ్మ సంబురాలు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భద్రకాళీ ఆలయంలో వైభవంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ ఆడారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు, మహిళలు బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు
Goddess are going on in splendor