శాంతియుత మార్గం సదా అనుసరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్, గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్ బాషాతో కలిసి పబ్లిక్ గార్డెన్లోని గాంధీజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాపూజీ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం, ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ సాధించారని పేర్కొన్నారు. జాతిపిత అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం కలను ముఖ్యమంత్రి సాకారం చేశారని స్పష్టం చేశారు.
– హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 2
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 2 : సత్యం, అహింస మార్గంలో బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు గాంధీ అని, ఆయన చూపిన మార్గం సదా అనుసరణీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహానికి చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్, ఎంపీ పసునూరి దయాకర్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్బాషా, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ గాంధీ మార్గంలోనే స్వరాష్ట్రం సాధించి, వలసలు తగ్గించిన మహనీయుడు మన సీఎం కేసీఆర్ అని అన్నారు. దేశానికి గాంధీజీ స్వాతంత్య్రం తెస్తే, మన రాష్ట్రానికి కేసీఆర్ స్వాతంత్య్రాన్ని తెచ్చారన్నారు. గాంధీ కలలను సాకారం చేసిం ది సీఎం కేసీఆరే అని అన్నారు. గాంధీ ఎప్పుడూ గ్రామా లు అభివృద్ధి చెందాలని కోరుకునేవారని, వలసలు తగ్గినప్పుడే గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆ మాటలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామాన్ని కడిగిన ముత్యంలా తయారు చేశామన్నారు.
మన గ్రామాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దామని, స్వచ్ఛభారత్లో మన రాష్ట్రమే నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఆదర్శ గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తే మన రాష్ట్రమే నంబర్ వన్ స్థానంలో ఉం టుందన్నారు. దేశంలో సంపూర్ణ ఓడీఎఫ్ రాష్ట్రం కూడా మన తెలంగాణనేనని అన్నారు. ఇవేగాక రైతులకు నూతన రెవెన్యూ చట్టం, రైతు బంధు, రైతు బీమా లాం టి పథకాలు అందజేసి, వారి కష్టాలు తీరుస్తున్నారన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని సూచించారు.