కాజీపేట, డిసెంబర్ 27: దక్షిణమధ్య రైల్వే సికింద్రాబా ద్ రైల్వే డివిజన్, కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్ష సెక్షన్లో ని బిజిగిరి షరీఫ్-పొత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతు న్న మూడోలైన్ పనులతో రద్దు చేసిన పలు రైళ్లను నేటి(బు ధవారం) నుంచి యథాతథంగా నడుపనున్నట్లు రైల్వే అధి కారులు తెలిపారు. ఈ రైల్వే స్టేషన్ల మద్య 10 కిలోమీటర్ల మూడోలైన్కు సంబంధించిన ఇంటర్ లాకింగ్, నాక్ ఇంట ర్ లాకింగ్, రైలు పట్టాలు, సిగ్నల్ పాయింట్లను కలిపే పను లతో రైళ్లను ఈ నెల 22 నుంచి 27 వరకు ఆరు రోజుల పాటు రద్దు చేశారు. మూడోలైన్ పనులు పూర్తి కావడంతో రైల్వే ఉన్నతాధికారులు సోమవారం లాంఛనంగా ప్రారం భించారు. ఇప్పటికే గూడ్స్ రైళ్లను తిరిగి నడిపిస్తున్నారు. ప్ర స్తుతం ఈ స్టేషన్ల మధ్య మూడో లైన్ పనులు పూర్తి కావ డంతో రద్దు చేసిన ప్రయాణికుల రైళ్లను తిరిగి నడిపిస్తున్న ట్లు అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్నగర్ మధ్య నడిచే భా గ్యనగర్ ఎక్స్ప్రెస్(17233)ను 27వ తేదీ సాయంత్రం నుంచే నడిపించారు. సిర్పూర్ కాగజ్నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్(17234), కాజీపేట రైల్వే జంక్షన్-సిర్పూర్ టౌన్, బల్లార్ష-కాజీపేట రైల్వే జంక్ష న్ల మధ్య నడిచే రామగిరి ప్యాసింజర్(17003/17004 ) మెము రైలు, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ మధ్య నడిచే కాగజ్నగర్ ఇంట ర్ సిటీ(17011/17012), కాజీపేట- బల్లార్ష, బల్లార్ష- కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య నడిచే కాజీపేట ప్యాసింజర్ (17035/17036 )రైలును నేటి (28వ తేదీ) నుంచి న డుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటుగా పెద్దపల్లి-నిజామాబాద్, సికింద్రాబాద్ మీదుగా రాకపోక ల్లో దారి మళ్లించిన న్యూఢిల్లీ-హైదరాబాద్ మధ్య నడిచే తెలంగాణ సూపర్ ఫాస్ట్(12724), సికింద్రాబాద్-ధానా పూర్ మధ్య నడిచే ధానాపూర్ ఎక్స్ప్రెస్(12791) రైలు ను నేటి నుంచి యథాతథంగా నడుపనున్నట్లు అధికారులు చెప్పారు.