ఐనవోలు మండలానికి చెందిన తాజా, మాజీ సర్పంచ్లు సొంతగూటికి చేరారు. సోమవారం హనుమకొండలోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన వర్ధన్నపేట నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా వారిని ఎర్రబెల్లి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఐనవోలు మండలానికి చెందిన పల్లకొండ సురేశ్, బరిగెల సదానందం ఉన్నారు.