మహబూబాబాద్, డిసెంబర్29 (నమస్తే తెలంగాణ); మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు శుక్రవారం పరామర్శించారు. సత్యవతిరాథోడ్ సోదరుడు గుగులోత్ కిషన్నాయక్ ఇటీవల మృతిచెందారు. శుక్రవారం దశదిన కర్మ నిర్వహించగా, హరీశ్రావుతోపాటు తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీచైర్పర్సన్ ఆంగోత్ బిందు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, హరిప్రియ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నాయకులు నూకల నరేశ్రెడ్డి, జాన్సన్ రాథోడ్, పెద్ది స్వప్న, చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ హాజరై కిషన్నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యవతి తన పరిస్థితిని హరీశ్రావుకు వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి తన అన్న ఎంతగానో ప్రోత్సహించారని, రెండు సంవత్సరాల్లో అమ్మ, నాన్న, అన్నను కోల్పోయానని విలపించారు. ధైర్యంగా ఉండాలే అక్కా అంటూ హరీశ్రావు ఆమెకు సూచించారు.