ఆకుపచ్చ తెలంగాణే సర్కారు లక్ష్యమని చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం హంటర్ రోడ్డులోని కాకతీయ జూపార్కులో జరిగిన హరితోత్సవంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి దాస్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపు నిచ్చారు. పచ్చదనం పెంపునకు అధికారులు కృషి చేయాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించేందుకే దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
– హనుమకొండ, జూన్ 19
హనుమకొండ, జూన్ 19 : ఆకుపచ్చ తెలంగాణే బీఆర్ఎస్ సర్కారు లక్ష్యమని, తెలంగాణ ఏర్పాటు అనంతరం అటవీ విస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో డీఎఫ్వో వసం త అధ్యక్షతన హనుమకొండ హంటర్రోడ్డులోని కాకతీయ జూ పార్కులో సోమవారం హరితోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చీఫ్విప్తోపాటు మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, నగర కమిషన్ షేక్ రిజ్వాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపార్కులో మొక్కలు నాటా రు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు అతిథులకు మొక్కలు అందజేశారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రకృతిని రక్షించాలని, రానున్న తరాలకు పచ్చని తెలంగాణను అందించాలన్నారు. ఇందుకుగాను గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచడంతో పాటు పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు చీఫ్ విప్ తెలిపారు. చెరువులను పరిరక్షించడంతోపాటు బంధం చెరువు, భద్రకాళీ చెరువు లాంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్, నగర కమిషనర్, అటవీ శాఖ అధికారులకు చీఫ్ విప్ సూచించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిక్షణకు పాటుపడాలని కోరారు.
మేయర్, కలెక్టర్, నగర కమిషనర్, కుడా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటి రక్షించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, అతిథులతో హరిత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పలు అంశాలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, డీఆర్డీవో శ్రీనివాస్కుమార్, మైనార్టీ కార్పొరేషన్ సభ్యుడు దర్శన్సింగ్, కార్పొరేటర్లు రావులు కోమలాకిషన్, బోయినపల్లి రంజిత్రావు, మామిళ్ల రాజు, ఎనుకంటి రాములు, మాజీ కార్పొరేటర్లు, జూపార్కు ఇన్చార్జి వీ రాజు, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
రీజినల్ సైన్స్ సెంటర్లో..
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హంటర్రోడ్డులోని రీజినల్ సైన్స్ సెంటర్లో హరితోత్సవం నిర్వహించినట్లు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ రాకేశ్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది ఉచితంగా సైన్స్సెంటర్ను సందర్శించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఆఫీసర్ నితీశ్రెడ్డి, వీ వెంకటేశ్వర్రావు, కీర్తి వివేక్, అనిల్, అశోక్కుమార్, రాజయ్య, నాగమణి, రామూనాయక్ పాల్గొన్నారు.