హనుమకొండ చౌరస్తా, జూలై 13 : అవగాహనతో అవకాశాలు.. సహకారంతో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. కేయూ సెనేట్హాల్లో గురువారం ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫోరం’ ఆధ్వర్యంలో ‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ సాలర్షిప్స్’ బ్రోచర్ల ఆవిషరణ కార్యక్రమం రిజిస్ట్రార్ ఆచార్య టీ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్లో గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫోరం కృషి చేయడం అభినందనీయమన్నారు. విదేశీ విద్య అర్హత పరీక్షకు భిన్నమైన శిక్షణ, ముఖ్యంగా ఆంగ్ల భాషపై పట్టు, ప్రావీణ్యం అవసరమని, ఈ అవకాశాలు గ్రామీణ విద్యార్థులకు అందాలని పేర్కొన్నారు.
వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ మాట్లాడుతూ.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ సాలర్షిప్స్ కోసం కేయూ పరిధిలోని 132 కాలేజీలను ఎంపిక చేశామని, 250 మంది విద్యార్థులు ఉపకార వేతనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి విదేశీ విద్యనభ్యసించే విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం అని అన్నారు. గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫోరం వ్యవస్థాపకుడు విజయకుమార్ నాయర్ మాట్లాడుతూ.. ఐఈఎల్టీఎస్, టోఫెల్, పీటీఈ కోసం ఉచితంగా 40 గంటల శిక్షణ ఇస్తామని, 2024లో చివరి సంవత్సరం పరీక్ష రాసే విద్యార్థులను అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేసి సాలర్షిప్స్ ఇస్తామన్నారు. రిజిస్ట్రార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేయూకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమానికి మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఇంగ్లిష్ విభాగ ఒప్పంద అధ్యాపకురాలు వీణ సంయోజకులుగా వ్యవహరించారు.