ఖానాపురం, ఫిబ్రవరి 4: మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ 1996-97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థి వడ్లకొండ రవి కుమార్తె మౌనిక వివాహానికి మిత్రులు ఆర్థిక సాయం అందించారు. రవి తన కుమార్తె వివాహాన్ని శనివారం ప్రేమ్కుమార్తో నిర్వహించాడు. ఈ మేరకు బాల్యమిత్రులు హాజరై వధూదరులను ఆశీర్వదించి, రూ. 35,016 ఆర్థిక సాయం అందించారు. స్నేహితులు చేయూతనందించడంతో రవి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీరమనేని సాగర్రావు, ఎండీ అజహర్, అక్బర్, హైమద్ పాషా, కందుకూరి రాజు, బుర్ర భాస్కర్ పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు బియ్యం, ఆర్థిక సాయం
నర్సంపేట మండలం పాతముగ్దుంపురం గ్రామానికి చెందిన సుంకరి పెద్ద సారయ్య ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. అనంతరం పార్టీ మండల నేత కంది కృష్ణచైతన్యరెడ్డి పంపించిన 50 కిలోల బియ్యాన్ని బాధితులకు నాయకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి లావణ్య, పార్టీ గ్రామ అధ్యక్షుడు సయ్యద్ బషీర్, మాజీ అధ్యక్షుడు నాంపెల్లి మల్లయ్య, నాయకులు పోలెపల్లి రమేశ్, రాజు, చిరంజీవి, మల్లయ్య, నర్సయ్య, మమత, సూరయ్య పాల్గొన్నారు.
అంతేకాకుండా నర్సంపేట పట్టణంలోని 1వ వార్డుకు చెందిన పట్టణ రిక్షా యూనియన్ అధ్యక్షుడు భూషనబోయిన లక్ష్మయ్య ఇటీవల మృతి చెందగా, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, కౌన్సిలర్ దేవోజు తిరుమల-సదానందం, మున్సిపల్ ఫ్లోర్లీడర్ మినుముల రాజు, 2, 3, 4, 12 వార్డుల కౌన్సిలర్లు జుర్రు రాజు, నునావత్ కవిత, శీలం రాంబాబు, మహ్మద్ పాషా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూ. 5 వేల ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి దొమ్మాటి సంతోష్ రూ. 4 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో నాయకులు సుమన్, రంజిత్, సృజన్, మాధవాచారి, వెంకట్, సంపత్, క్రాంతి, శివ పాల్గొన్నారు. అలాగే, ఖానాపురం మండలం ధర్మారావుపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మేడిద మల్లయ్య తల్లి నర్సమ్మ(85) శనివారం మృతి చెందగా, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి వెంట నాయకులు వెన్ను పూర్ణచందర్, సమ్మయ్య, పులిగిళ్ల యాదగిరి ఉన్నారు.