ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా
చిన్నకోడెపాక గ్రామంలో క్రీడా ప్రాంగణానికి భూమి పూజ
పోచంపల్లిలోని అంగన్వాడీ కేంద్రం పరిశీలన
భూపాలపల్లి రూరల్, మే 30: జిల్లాలోని రైతు లందరూ ఈకేవైసీ అప్డేట్ చేసుకునేలా వ్యవసా య అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాల యంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ జయశంకర్ భూపాలపల్లి రైతులకు వస్తు న్న పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధులను పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అప్ డేట్ చేయించుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 46,726 మంది రైతులకు 24,384 మంది లబ్ధి దారులు మాత్రమే ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నా రని తెలిపారు. మిగిలిన వారందరూ 31వ తేదీ వరకు చేసుకునేలా చూడాలని అన్నారు. ఈకేవైసీ నమోదు చేసుకోని వారి పేర్లను గ్రామ పంచాయ తీల్లోని నోటీస్ బోర్డు నందు అతికించాలని సూ చించారు. సమావేశంలో డీఏవో విజయభాస్కర్, సీఎస్సీ అధికారి మాధురి, వ్యవసాయ అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలను వెంటనే పరిష్కరించండి
అధికారులు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్య క్రమంలో ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించా రు. ఈ రోజు 60 దరఖాస్తులు వచ్చాయన్నా రు.
క్రీడా మైదానం ఏర్పాటకు భూమి పూజ
రేగొండ: మండలంలోని చిన్నకోడెపాక గ్రా మంలో క్రీడా వైదాన ఏర్పాటుకు భూమి పూజ చేశారు. అనంతరం పోచంపల్లి గ్రామంలోని అంగ న్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సెంటర్కు నీతి ఆయోగ్ కింద మరమ్మతు, సౌకర్యాల ఏర్పా టుకు రూ. 10 లక్షలు మంజూరు కాగా, వాటి ప నులను మంగళవారం మంత్రి సత్యవతిరాథోడ్ ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాలతో క్రీడలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. కార్యక్ర మంలోఎంపీపీ పున్నం లక్ష్మి, తహసీల్దార్ హరీశ్, వివిధ శాఖల ఆధికారులు ఉన్నారు.