భీమదేవరపల్లి, అక్టోబర్ 12 : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటను దళారులకు అమ్మి రైతులు మోసపోవద్దని ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొక్కల స్రవంతి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా ముల్కనూరులో ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతులు శ్రమించి పంటను పండిస్తుంటే దళారులు మాయమాటలు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన చెందారు. సీసీఐ కేంద్రంలో రైతులకు పత్తి ధర క్వింటాకు రూ. 8,110 వస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.