సంగెం, మార్చి 23: ఇటీవల కురిసిన వడగండ్ల వానకు జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు సేకరించేందుకు గురువారం వ్యవసాయాధికారులు విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా సంగెం ఏవో చట్ల యాకయ్య ఆధ్వర్యంలో మండలంలోని మొండ్రాయి, సంగెం, కాపులకనపర్తి, తీగరాజుపల్లి, గవిచర్లలో రెవెన్యూ, పంచాయతీ, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తామే పంటల వద్దకు వస్తామని, రైతులు ఇబ్బందులు పడొద్దని ఏవో సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాజేందర్, సాగర్, సమత పాల్గొన్నారు.
పంటనష్టం వివరాల నమోదు..
నర్సంపేటరూరల్/నల్లబెల్లి: నర్సంపేట మండలంలోని రామవరంలో దెబ్బతిన్న పంటలను ఏఈవో నవీన్ పరిశీలించారు. మక్కజొన్న, మిర్చి, వరి పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. వ్యవసాయాధికారులు నేరుగా పంట చేల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న, కార్యదర్శి నీలం వీరేశ్కుమార్, వీఆర్ఏ స్వప్న, వార్డు సభ్యుడు కోరబోయిన కుమారస్వామి, రైతులు పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లి మండంలోని లెంకాలపెల్లి, మూడుచెక్కలపల్లె, రంగాపూర్, కొండాపూర్లో ఎంపీవో కూచన ప్రకాశ్తోపాటు వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వడగండ్ల వర్షానికి మండలంలో మిర్చి తోటలు, మక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఎంపీవో తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్రావు, ఏఈవోలు శ్రీకాంత్రెడ్డి, సాధన, ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
నష్ట పోయిన రైతులకు పరిహారం
ఖిలావరంగల్: వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం అందిస్తుందని, రైతులు అధైర్య పడొద్దని 17వ డివిజన్ కార్పొరేటర్ గద్దె బాబు భరోసా ఇచ్చారు. మండలంలోని స్తంభంపల్లి, బొల్లికుంటలో దెబ్బతిన్న పంటలను వ్యవసాయాధికారులతో కలిసి పరిశీలించారు. రైతులకు ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అండగా ఉంటారన్నారు. ఈ నెలాఖరు వరకు పంటల నమోదు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ తరగల ప్రసాద్, పోచన స్వామి, ఏఈవోలు చంద్రకాంత్, సత్యప్రకాశ్, ఏఎంసీ డైరెక్టర్ తుమ్మ రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సోల్తీ భూమాత, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కత్తెరపల్లి దామోదర్, మారపాక రాజీవ్గాంధీ, సుధాకర్, శంకర్రావు, సోల్తీ నరేందర్, టోని, రవి పాల్గొన్నారు.