ములుగు, ఏటూరునాగారం, నవంబర్ 27 : రాష్ట్రంలో రా బోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది కేసీఆర్ అని, ములుగు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్షోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు మళ్లీ చేయొద్దని, ఆనాడు అభ్యర్థి ఓడినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ములుగును జిల్లా గా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామన్నారు.
నియోజకవర్గ పెం డింగ్ సమస్యలను నాగజ్యోతి తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ మెను గెలిపిస్తే వాటన్నింటినీ తప్పనిసరిగా పరిష్కరిస్తామన్నా రు. మంగపేట మండలం కమలాపురంలో మూతపడిన బిల్టుఫ్యాక్టరీని తెరిపించే పూచి తనదేనని హామీ ఇచ్చారు. ఏటూరునాగారంలో తప్పకుండా బప్డిపో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముల్లకట్ట నుంచి అకినేపల్లి మల్లారం వరకు గోదావరి క రకట్ట, యువత కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ సైతం నిర్మిస్తామన్నారు. కొండాయి గ్రామానికి రోడ్డు, బ్రిడ్జి నిర్మిస్తామని, గోదావరి ముం పు ప్రాంత వాసులకు మోడల్ కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మ్యానిఫెస్టోలో పేర్కొన్న పథకాలన్నింటినీ అమలు చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి పిరమైన ప్రధానిగా చరిత్రకు ఎక్కారన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ రేషన్ షాపుల ద్వారా ప్రతి నెలా సన్న బియ్యం అందిస్తామన్నారు. 50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఆసరా పింఛన్లు రూ. 200లకు పరిమితం చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రూ.2వేలు ఇస్తున్నదని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే దానిని రూ.5వేలకు పెంచుతామన్నారు. జనవరిలో కొత్త రేషన్కార్డులు, కొత్త పింఛ న్లు ఇప్పించే బాధ్యత తనదేన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించి ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు సైతం పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
రేవంత్రెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం వల్లే రైతుబంధు ఆగిందని, పదకొండు సార్లు రైతు బంధు ఇచ్చినట్టే మూడో తేదీన రైతులందరికీ 12వ దఫా రైతు బంధు డబ్బులు జమ చేస్తామన్నారు. మార్పు కావాలంటున్న కాంగ్రెస్ నాయకులు ఏం మార్పు కావాలో వారికి అర్థం కావడం లేదన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ర్నెళ్లకో ముఖ్యమంత్రిని మార్చే మార్పు కావాలా అని ప్రశ్నించారు.
నల్లధనాన్ని వెలికితీసి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని చెప్పిన మోదీ ఉప్పు, పప్పుల ధరలు పెంచి మోసం చేశాడన్నారు. నాగజ్యోతిని గెలిపిస్తే సీఎం కేసీఆర్ కూడా ములుగులో రెండు రోజలు ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. మీరు గెలిపించాల్సింది ఇన్స్ట్రాగ్రామ్ ఎమ్మెల్యేను కాదని ప్రజల్లో ఉండి మీకు సేవ చేసే వారిని అని గుర్తు చేశారు.
50 ఏండ్లు పరిపాలించిన దిక్కు మాలిన కాంగ్రెస్తో రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడం వల్లే తెలంగాణ తెచ్చుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ దరిద్రాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకుందామా అంటూ ప్రశ్నించారు. మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని రేవంత్రెడ్డి అంటున్నారని మూడు గంటలు ఇస్తే సరిపోతుందా అన్నారు. 2014కు ముందు ములుగులో కాం గ్రెస్ ప్రభుత్వం ఉందని ఆనాడు బస్ డిపో ఎందుకు ఏర్పాటు చేయలేక పోయారన్నారు. ఏటూరునాగారంలో ఆనాడు కరెం టు పరిస్థితి ఎలా ఉండేది.. ఇపుడేలా ఉండేదో మీకే తెలుసన్నారు. కాంగ్రెస్ పాలనలో పేలిపోయే మోటర్లు, కాలిపోయే స్టార్టర్లు, రాత్రి పూట కరెంటుతో రైతులు అవస్థలు పడ్డారన్నారు.
పాములు కరిచి కరెంటు షాక్లతో ప్రాణాలు కోల్పోయారన్నారు. వ్యవసాయం గురించి తెలియక ఉత్తమ్ కుమార్రెడ్డి రైతు బంధు దండుగా అని, భట్టి విక్రమార్క పట్వారి వ్యవస్థను మళ్లీ తెద్దామంటున్నాడని, ధరణి తీసేసి భూమేత తెస్తామంటున్నారన్నారు. మళ్లీ ఊళ్లలో దళారులు, పట్వారీలు కావాలా అం టూ ప్రశ్నించారు. ఒక్క చాన్సు ఇవ్వండి అంటున్నారని, పదకొండు చాన్సులు ఇస్తే 55 ఏండ్లు రాష్ట్రంలో, దేశంలో అధికారం చెలాయించి ఏం ఒరగబెట్టారని నిలదీశారు. దిక్కుమాలిన ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు, గంజి కేంద్రాలు కొనసాగాయన్నారు.
కేసీఆర్ పరిపాలనలో పేదలు, రైతులు, యువకులు సమస్త ప్రజానీకం ఆనందంగా ఉన్నారన్నారు. గతంలో ఓటు వేయకున్నా, ములుగును జిల్లా చేశాం కానీ, ఈసారి మాత్రం నాగజ్యోతిని గెలిపిస్తేనే అడిగినవన్నీ చేసి పెడుతామని కేటీఆర్ నవ్వుతూ అన్నారు. పనులన్నీ కావాలంటే కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే మంచిది కాదన్నారు. కత్తి నాగజ్యోతికి ఇవ్వాలి..యుద్ధం నాగజ్యోతి చేస్తుందని ప్రజలు అడిగిన ప్రతి పని చేసే బాధ్యత మాదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. రోడ్డు షోలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనువాసరెడ్డి, రోడ్లు భవనాల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నర్సింహారావు, మండలాధ్యక్షుడు గడదాసు సునీల్కుమార్ పాల్గొన్నారు.
– బీఆర్ఎస్ ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి
అందరి ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని, కొంగు చాచి ఓట్లు అడుతున్నానని, ఒక్కసారి అవకాశం కల్పిస్తే ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనని చెప్పారు. ఏనాడు కూడా ములుగు ప్రాంత అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఓటు వేయాలని అడుతున్నారని, వారి మాటలు నమ్మకుండా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
ప్రతి పక్ష పార్టీల ఎమ్మెల్యేలు మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం వలే అభివృద్ధి చేస్తామని అంటున్నారని, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వారు అభివృద్ధి చేసిన నమూనా నియోజకవర్గం ఒక్కటి కూడా లేదన్నారు. ములుగు సమస్యలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, అవన్నీ కూడా పరిష్కారం అవుతాయన్నారు. ప్రభాకరన్న బిడ్డగా సాదుకున్నా, చంపుకున్నా ప్రజలేనని ఉద్వేగంతో మాట్లాడారు. ఇక్కడి ప్రజల కోసం సచ్చేదాకా కొట్లాడే సత్తా తనకుందని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా సేవకే అంకితం అవుతానని తెలిపారు.