దుగ్గొండి/సంగెం/కరీమాబాద్/చెన్నారావుపేట/వర్ధన్నపేట/నర్సంపేటరూరల్/నెక్కొండ/పోచమ్మమైదాన్/ఖిలావరంగల్, జనవరి 6: అర్హులైన పిల్లలందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని నర్సంపేట డిప్యూటీ డీఎంహెచ్వో ప్రకాశ్ సూచించారు. దుగ్గొండిలోని పీహెచ్సీలో గురువారం తొగర్రాయి పాఠశాల విద్యార్థులకు వ్యాక్సినేషన్ను ఆయన ప్రారంభించారు. ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, సర్పంచ్ తిరుపతిరెడ్డి, వైద్యాధికారి క్రాంతి పాల్గొన్నారు. సంగెం మండలం గవిచర్ల మోడల్స్కూల్, మొండ్రాయి జడ్పీఎస్ఎస్ విద్యార్థులకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి ప్రారంభించారు. మోడల్స్కూల్లో 236 మంది, మొండ్రాయి జడ్పీఎస్ఎస్లో 60 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి పొగాకుల అశోక్గౌడ్ తెలిపారు. వరంగల్ 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ను ఆయన పరిశీలించారు. హెచ్ఎం అచ్చ వినోద్కుమార్ పాల్గొన్నారు. 33వ డివిజన్ శాంతినగర్లోని సన్రైజ్ పాఠశాలలో టీకా కార్యక్రమాన్ని కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ పరిశీలించారు. హెచ్ఎం బాశెట్టి వెంకటేశ్వర్లు, కరస్పాండెంట్ శారద పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని జడ్పీఎస్ఎస్, అమీనాబాద్ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి ఉషారాణి తెలిపారు.
గురువారం 548 మందికి వైద్య సిబ్బంది టీకాలు వేశారన్నారు. సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుండె మల్లయ్య, హెచ్ఎంలు పోలెపల్లి రవి, ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు. వర్ధన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్హులైన బాలబాలికలకు ప్రత్యేక శిబిరం ద్వారా టీకాలు వేశారు. నర్సంపేట మండలం గురిజాల పాఠశాలలో టీకా కార్యక్రమాన్ని సర్పంచ్ గొడిశాల మమత పరిశీలించారు. హెచ్ఎం గుడిపూడి రాంచందర్రావు, ఏఎన్ఎం రజిని పాల్గొన్నారు. నెక్కొండ మండలం చంద్రుగొండలో వ్యాక్సినేషన్ను ఎంపీపీ రమేశ్ ప్రారంభించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్ బక్కి రాజమ్మ, ఉప సర్పంచ్ సతీశ్, ఎంపీటీసీ అజయ్, పాల్గొన్నారు. దీక్షకుంటలో సర్పంచ్ ఆలకుంట సురేందర్ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. పల్లె దవాఖాన అధికారి నాగరాణి, హెచ్ఎం దేవేందర్, కార్యదర్శి భానుప్రకాశ్ పాల్గొన్నారు. వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్లోని ప్రభుత్వ చార్బౌళి పాఠశాలలో విద్యార్థుల వ్యాక్సినేషన్ను కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ పరిశీలించారు. ఎస్ఎంసీ చైర్మన్ అఫ్జల్, హెచ్ఎం సరస్వతీదేవి, డాక్టర్ భాగ్య పాల్గొన్నారు. ఖిలావరంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు టీకా వేశారు. వరంగల్ 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమాదామోదర్యాదవ్, ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్ కాక మాధవరావు కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రసాదరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.