హనుమకొండ చౌరస్తా, 28: తెలంగాణ రాష్ట్రంలో ఏకశిల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో వివరాలు వెల్లడించారు. ఎంపీసీలో సీహెచ్.హర్షిణి 987 మార్కులు, బైపీసీలో ఎం.ప్రవళిక 990, కె.సంధ్యాదేవి 989, సీఈసీలో ఎల్.సిరిచందన 963 మార్కులు సాధించగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో జి.దయాకర్ 466, బి.ఆలేఖ్య 466, ఎల్.ఇందు 466, బైపీసీలో వి.అనుష్క 437, డి.నిఖిత 436, ఎం.సాయిశృతి 436, ఎన్.శివమణి 436, సీఈసీలో ఆర్.గాయత్రి 489, పి.వైష్ణవి 485 మార్కులు సాధించినట్లు తెలిపారు.
నిర్దిష్టమైన ప్రణాళిక, అత్యుతమైన బోధన, క్రమశిక్షణతో కూడిన విద్యావిధానం, నిరంతరం యాజమాన్య పర్యవేక్షణతో ఇంటర్ ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థలు రాష్ట్రస్థాయిలో మొదటిస్థానం సాధించాయని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాలతోపాటు కాంపిటీటివ్ పరీక్షలైన జేఈఈ మెయిన్స్, నీట్, ఎంసెట్లలోనూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఎం.జితేందర్రెడ్డి, ప్రిన్సిపాల్స్ సుధాకర్రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితోపాటు బోధనా సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.