వరంగల్ : నగరంలోని మురికి వాడల అభివృద్ధికి కృషి చేస్తాననివరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.వరంగల్లోని 37 వ డివిజన్ పరిధిలో ఉన్న గిరిప్రసాద్ నగర్, బుడిగజంగాల కాలనీ, మోయిన్ పుర, ఎం.ఎం నగర్ లలోని సమస్యల అధ్యయనం, పరిష్కారం కోసం స్థానిక కార్పొరేటర్ భోగి సువర్ణ తో కలిసి విస్తృత పర్యటన చేశారు.
ఈ సందర్భంగా ప్రజలు, మహిళలు మంగళ హారతులతో, పూలతో, బొట్టు, బోకేలతో ఘనంగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం నన్నపునేని కాలనీల్లోని గల్లి గల్లి తిరిగి సమస్యలు తెలుసుకొని ప్రజలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలలో మౌలిక వసతులైన మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు తదితర వసతులు పరిశీలించానని, గుడిసెవాసులైన వీరికి మిషన్ భగీరథ ద్వారా 15 రోజుల్లో ప్రతి ఇంటికి మంచినీరు అందించేలాచేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ సరిగా లేకపోవడం వలన మురికినీరు నిలిచి ఇబ్బంది కలుగుతుందని, వాటి పరిష్కారానికి తక్షణం డ్రైనేజీల నిర్మాణం చేయిస్తామన్నారు.
అనంతరం కాన్సర్ తో బాధపడుతున్న సయ్యద్ హమీదా బీ ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పోశాల స్వామి, బైరబోయిన దామోదర్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, గిరిప్రసాద్ నగర్ అధ్యక్షుడు ఎం.డి ఉల్ఫత్, ఎం.ఎం.నగర్ అధ్యక్షుడు సింగారపు ఏలీయా తదితరులు పాల్గొన్నారు.