ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటాయి. రామ్లీల కార్యక్రమాలు సోమ, మంగళవారాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. పల్లెలు, పట్టణాల్లో రావణాసుర ప్రతిమలను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తారాజువ్వల వెలుతురులో మైదానాలన్నీ మిరుమిట్లు గొలిపాయి. లక్షలాది మంది ప్రజలు పాల్గొని వేడుకలను తిలకించారు. విజయదశమి వేడుకల్లో భాగంగా ఆలయాలు, వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన జమ్మిచెట్ల వద్ద పూజలు చేశారు. పాలపిట్ట దర్శనం అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుని..అలయ్బలయ్ తీసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో సిబ్బంది ఆయుధ పూజ చేశారు. జనగామలో నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి చైర్మన్ తాటికొండ రాజయ్య పాల్గొని రావణ వధను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు.
తొర్రూరు, అక్టోబర్ 24 : తొర్రూరు మున్సిపల్ కేంద్రంలోని అన్నారం రోడ్డు శక్తి స్థల్ వద్ద ఉత్సవ్ కల్చరల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, యతిరాజరావు పార్ ఆవరణలో ఉషోదయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాడుగుల రోహిత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి దసరా వేడుకలు అంబరాన్నంటాయి. తారాజువ్వల వెలుగులు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నయి. రెండు చోట్ల జరిగిన వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, యతిరాజారావు పార్ లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సుధాకర్రావు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు. నాడు సమాజ పరిరక్షణ, లోకకల్యాణం కోసం శ్రీరాముడు రావణాసురుడిని వధించినట్లు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా ఏటా దసరా వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఆధునిక సమాజంలో ప్రజలు చెడు మార్గం వైపు వెళ్లకుండా, చెడ్డవాళ్లను ఆదరించకుండా మంచి మార్గంలో పయనించాలని కోరారు. తొర్రూరు పట్టణాన్ని అన్నిరంగాల్లో ముందుంచడం కోసం నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో తొర్రూరు.. ప్రస్తుతం పట్టణానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. వేల కోట్ల రూపాయలతో పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు.
ఎలక్షన్ కోడ్తో పనుల్లో కొంత ఆలస్యం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే తొర్రూరును మోడల్ మున్సిపల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా మరోసారి తనను ఆశీర్వాదించాలని కోరారు. తొర్రూరులో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా రావణాసుర వధ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర, ఉత్సవ కల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధులు ధరావత్ రాజేశ్నాయక్, కుర్ర శ్రీనివాస్, బిజ్జాల అనిల్, పొద్దుటూరు గౌరీశంకర్, ధరావత్ జై సింగ్, సంకటాల సోమేశ్వర్, జాటోత్ సురేశ్, నడిగడ్డ శ్రీనివాస్, సురేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఉషోదయ ఉత్సవ కమిటీ వేడుకల్లో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జలీల్, జలగం శ్రీనివాస్, నిర్వహణ కమిటీ ప్రతినిధులు ముద్దసాని సురేశ్, మాడ్గుల పూలమ్మ, పాలిశెట్టి శ్రీనివాస్, మాలిక్, భూపతి, రాములు, జమ్మిపూజలో డాక్టర్ రాజేందర్రెడ్డి, యాదగిరిరెడ్డి, వెంకటేశ్వర్రావు, ఆచార్యులు శ్రీకాంతాచార్యులు పాల్గొన్నారు.