నర్సంపేట, డిసెంబర్ 8: అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం పంపిణీలో జాప్యం చేయొద్దని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు. ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు గొర్రె రాధ, బత్తిని శిరీష ఆధ్వర్యంలో గురువారం నర్సంపేటలోని ఏసీడీపీవో విద్యకు వినతిపత్రం అందజేశారు.
ప్రాజెక్టు పరిధిలోని ఎనిమిది మండలాల్లో కోడిగుడ్ల సరఫరాలో అంతరాయం కలుగుతున్నదని తెలిపారు. సరుకుల సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. రమాదేవి, సునీత, శ్రీలత, ధనలక్ష్మి, వాణి, పద్మ పాల్గొన్నారు.