స్టేషన్ ఘన్పూర్, ఆక్టోబర్ 29: కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే తెలంగాణకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని, ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం స్టేషన్ఘన్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. అధికారంలోకి వస్తే మేం కూడా ఉచిత కరెంటు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కరెంటు ఎందుకివ్వడం లేదని ఆయ న ప్రశ్నించారు. వ్యవసాయానికి ఐదు గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి మాట్లాడారని, మరి కర్ణాట కలో రైతుల పంటలు ఎండిపోతే ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్కు ఓటు వేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని తెలంగాణలో కర్ణాటక రైతులు ఎందుకు ప్రచారం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. నియోజవర్గంలో కడియం గెలిస్తే మళ్లీ లింగంపల్లిలో రిజర్వాయర్ నిర్మాణం చేపడతారని కాం గ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగదని చిల్పూర్ మండల ప్రజలకు హామీ ఇస్తున్నానని కడియం పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు రుణ మాఫీ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రైతులు రుణాలు తీసుకున్న ఖాతాలకు బదులు కొత్తవి ఇవ్వడం వల్ల రుణమాఫీ పాత ఖాతాల్లో పడుతున్నాయని పేర్కొన్నారు. రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి ఈ సమస్యను పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయానని, త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందన్నారు. శనివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మండల పార్టీ మాజీ అధ్యక్షుడు అక్కనపల్లి బాలరాజు, సానాది రాజు ఆధ్వర్యంలో తాటికొండ గ్రామానికి చెందిన 45 మంది యువకులు కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మామిడాల లింగారెడ్డి, పోగుల సారంగపాణి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎడ్ల వెంకట స్వామి, ఎంపీటీసీ గున్ను నర్సింహులు, రైతుబంధు సమితి సభ్యుడు రాపోలు మధుసూదన్రెడ్డి, సర్పంచ్ కోతి రేణుకారాములు, అనితా సుధాకర్ బాబు, గ్రామ అధ్యక్షులు మునిగల రాజు, పొన్న శ్రీనివాస్, కందుల గట్టయ్య, జోగు కుమారస్వామి, అంబటి కిషన్ రాజు పాల్గొన్నారు.
అనేక మంత్రి పదవులు చేపట్టి, ఉమ్మడి రాష్ట్రంలో నాకంటూ గుర్తింపు తీసుకొచ్చిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నాలక్ష్యం.. ఈ ఎన్నికల్లో మీరు మరోసారి నాకు సేవ చేసే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి కోరారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రంలో శివునిపల్లి ఎంపీటీసీ బూర్ల లతాశంకర్ ఆధ్యక్షతన శివునిపల్లి బొడ్రాయి నుంచి ప్రచార రథంపై ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ మీరు ఇచ్చిన అవకాశంతో ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మీకు ఏనాడు తలవంపులు వచ్చేలా నడుచుకోలేదన్నారు. నిజాయితీతో పని చేసి మీరు మెచ్చేలా పనిచేశానని కడియం శ్రీహరి అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే సీఎం కేసీఆర్ సహకారంతో దళితబంధు, గృహలక్ష్మి, బీసీ, మైనార్టీబంధు పథకాలను అర్హులైన వారికి అందిస్తానని, నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, ఎంపీటీసీ గుర్రం రాజు, సీనియర్ నాయకుడు పార్శి కృష్ణారావు, మాజీ ఎంపీటీసీ గుర్రం ఫాతికుమార్, సొసైటీ డైరెక్టర్ తోట సత్యం, కడియం యువసేన గ్రామ అధ్యక్షుడు బూర్ల రాజు, మాఈ సర్పంచ్ కొంతం శ్రీనివాస్, నాయకులు వంగ శ్రీనివాస్, ఏసుబాబు, గ్రామ అధ్యక్షుడు బైరి బాలరాజు, మార్కెట్ డైరెక్టర్ చిగురు సరిత, శ్రీను పాల్గొన్నారు.