నెల్లికుదురు, అక్టోబర్ 29 : ‘సీమాంధ్రులకు మానుకోట రాళ్ల పౌరుషం చూపిన నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిపించారు. మళ్లీ ఆశీర్వదించండి.. పెద్ద పాలేరుగా నిత్యం మీకు సేవలు చేస్తా’నని బీఆర్ఎస్ మహబూబాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ‘ఇంటి ముం దు అభ్యర్థి- కంటి ముందు అభివృద్ధి’ అనే నినాదంతో ఆదివారం ఆయన మండలంలోని వావిలాల గ్రామంలో ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకర్నాయక్కు మహిళలు తిలకందిద్ది, మంగళహారతులతో స్వాగతం పలికారు. వావిలాల, రాజ్యతండా, బోటిమీదితండా, నర్సింహులగూడెం, కాస్యతండా, హేమ్లతం డా గ్రామపంచాయతీలతోపాటు శివారుతండాల్లో ఇంటిం టా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించి ఓట్లు అభ్యర్థించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. దశాబ్దాలపాటు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కేవ లం పదేళ్లలోనే సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చే సి, దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ. 200 ఉన్న పింఛన్ను రూ.2వేలకు పెంచామని, పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా116 ఇస్తూ అండగా నిలిచామన్నారు. రైతులకు 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతు బీమా ఇలా ఎన్నో పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసింది కేసీఆర్ కాదా.. ప్రజలు ఆలోచించాలన్నారు.
నాడు గిరిజన తండాల్లో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుండె.. ఇప్పుడు గిరిజన తండాల ముంగిట్లోకి పాలన చేరిందని, గల్లీగల్లీకి సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, భగీరథ నీళ్లతో కళకళలాడుతున్నాయన్నారు. ఒక్కసారి ‘మీ గుండెమీద చెయ్యి వేసుకుని ఆలోచించండి.. మీ కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి చేసిందెవ్వరో వారికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీని నమ్మితే మోసపోయి గోసపడుతామన్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కర్ణాటక రాష్ట్రంలో 5 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నదన్నారు. పల్లెలో తట్టెడు మట్టిపోసి అభివృద్ధి చెయ్యని కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయ మాటలు నిమ్మితే భవిష్యత్లో అరిగోసపడుతామన్నారు. పదేండ్లలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశా.. ప్రతి ఇంటికీ సం క్షేమ ఫలాలు అందించా.. మళ్లీ పెద్దమనుషుతో ఆశీర్వదించండి.. మీ పెద్ద కొడుకుగా, మీ పాలేరు గా సేవ చేసి రుణం తీర్చుకుంటానని ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుపాటి వెంకట్రెడ్డి, వెన్నాకుల శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ కే విజయ్యాదవ్, రైతుబంధు సమితి మం డల కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు చిర్ర యాకాంతం గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తినిల అనిల్, బిక్కునాయక్, మండల మీడియా ఇంచార్జీ ఎడ్ల మహేశ్, పల్లె రాము, ఆయా గ్రామాల సర్పంచ్లు శ్రీనివాస్, ఉప్పలయ్య, బుజ్జి, నాయకులు రాజేశ్, ప్రశాంత్, షరీఫ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు.