గిర్మాజీపేట, ఫిబ్రవరి 15 : జిల్లా వ్యాప్తంగా బుధవారం వరకు 1,28,110 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. 24,567 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 14,663 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇవ్వగా, 1,450 మందికి అందజేసినట్లు చెప్పారు. తెలిపారు. 1,28,110 మందిలో 59,495 మంది పురుషులు, 68,596 మంది స్త్రీలు, 15 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారన్నారు. 20,316 ఎస్సీలు, 11,134 ఎస్టీలు, 86,882 బీసీలు, 5,911 ఓసీలు, 3,863 మైనార్టీలు, 40 ఏండ్లలోపు వారు 3,224 మంది, 40 ఏండ్ల పైబడిన వారు 21,341 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. 88,880 మందికి కంటి సమస్యలు లేవన్నారు.
దుగ్గొండి : కంటి వెలుగు కార్యక్రమాన్ని మండలంలోని పొనకల్, నాచినపల్లి గ్రామాల్లో కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ మధుసూదన్ పరిశీలించారు. కార్యక్రమంలో కేశవాపురం వైద్యాధికారి, విజయ్కుమార్, కంటి వెలుగు వైద్యుడు హుస్సేన్, సూపర్వైజర్ గోడిశాల భాస్కర్గౌడ్ పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్ : పట్టణంలోని 16వ వార్డులో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కౌన్సిలర్ వేల్పుగొండ పద్మ-రాజు ప్రారంభించారు. కౌన్సిలర్లు మినుముల రాజు, శీలం రాంబాబు, పాషా, బోడ గోల్యానాయక్, గందె చంద్రమౌళి, రామసహాయం శ్రీదేవి-సుధాకర్రెడ్డి, రుద్ర ఓంప్రకాశ్, నాయకులు బానోత్ వీరన్న, దేవోజు సదానందం, ఇమ్మడి స్వామి, శీలం వీరన్న, గులాబ్, యూత్ అధ్యక్షుడు చైతన్య, రమేశ్, శ్రీను, మున్సిపల్ సిబ్బంది నాగరాజు, శ్రీధర్, జవాన్ కుమార్, బోడ ప్రవీణ్, లావణ్య, మహబూబీ, వెన్నెల, లక్ష్మి పాల్గొన్నారు.
పర్వతగిరి : మండలంలోని ఏబీ తండాలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కమల పంతులు ప్రారంభించారు. పలువురికి కంటి అద్దాలను అందించారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహ్మద్ సర్వర్, సర్పంచ్ ప్రమీలాగోపి, ఉపసర్పంచ్ వెంకటరామిరెడ్డి, ఎస్టీ సెల్ మండల కార్యదర్శి కిషన్ నాయక్ పాల్గొన్నారు.