వరంగల్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు లాప్ టాప్స్, మొబైల్స్, బ్యాటరీ చైర్స్, ట్రై స్కూటీస్ను జెడ్పీ కార్యాలయంలో మహిళ, శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పంపిణీ చేసింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి జ్వోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.
దివ్యాంగులకు 2 మొబైల్ ఫోన్స్, 4 లాప్ టాప్స్, 8 బ్యాటరీ చైర్స్,17 స్కూటీస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీవో సంపత్ రావు, ఇతర అధికారులు, జడ్పీ సిబ్బంది పాల్గొన్నారు.