చెన్నారావుపేట, సెప్టెంబర్ 22 : రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వంతోనే పండుగలకు గుర్తింపు వచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మతాలకతీతంగా అధికారికంగా సంబురాలు నిర్వహి స్తున్నదన్నారు. ప్రతి పేద వాడికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. మండలంలోని చెన్నారావుపేట, అక్కల్చెడ, అమీనాబాద్, పత్తినాయక్ తండా, లింగగిరి, జల్లి, ఎల్లాయగూడెం గ్రామాల్లో 878 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు కారణాల వల్ల పెన్షన్ రాని వారు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్షే మ పథకాలు అందకుండా బీజేపీ నాయకులు కుట్ర లు చేస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు నీరా జనాలు పట్టడాన్ని ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పెన్షన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే పెద్ది, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దసరా కానుకగా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. చెన్నారావుపేట పీఏసీఎస్లో రూ.50వేల లోపు ఉన్న రుణాల మాఫీకి సంబంధించిన చెక్కులను రైతులకు అందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్లు కుండె మల్లయ్య, సతీశ్, క్లస్టర్ బాధ్యులు, నాయకులు కృష్ణ చైతన్య, చెన్నారెడ్డి, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యు డు గఫార్, మాజీ ఎంపీపీ జక్క అశోక్, ఇన్చార్జి ఎంపీడీవో దయాకర్, ఎంపీవో ప్రకాశ్, తూటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలను కాపాడుకుంటాం..
నర్సంపేట : కార్యకర్తలను కంటికి రెప్పలా టీఆర్ఎస్ పార్టీ కాపాడుతున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల విలువైన బీమా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కు టుంబాలను ఆదుకుంటామన్నారు. టీఆర్ఎస్ అంటేనే భరోసా, భద్రత, సంక్షేమం, సుస్థిర పాలన అని అన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలను ఆదుకుంటున్నారని తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందిస్తున్నారని తెలిపారు. దేశంలోనే కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము చెల్లించే పార్టీ టీఆర్ఎస్ మాత్రమేన న్నారు. చిన్నగురిజాలకు చెందిన వెంగ ల్ దాసు నాగరాజు, వెంగళదాసు కృష్ణమూర్తి, నెక్కొండ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఏశబోయిన కొమురయ్య, నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెంది న సంగ కుమారస్వామి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున చెక్కులను అందించారు.