హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 12: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మన బలాలపై మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలని అన్నింటికి మించి మానసిక బలం గొప్పదని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యా లయ సెనెట్ హాల్లో మంగళవారం యూనివర్సిటీ దివ్యాంగుల సెల్ సంచాలకులు డాక్టర్ ఏ రాజు అధ్యక్షతన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్స వం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని వీసీ రమేశ్ మాట్లాడుతూ దివ్యాంగులు తమ బలాల ను, ప్రతిభను నమ్ముకోవాలని, లక్ష్యం గొప్పగా ఉండాలన్నారు. నైరాశ్యం విడనాడాలని, జయాప జయాలు నువ్వే కారణమన్నారు. ఈ సందర్భం గా స్టీఫెన్ హకిన్స్, బాలలత, ఆచార్య నాగే శ్వర్ను గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో యూరో పియన్ యూనియన్, హంగేరి దేశానికి చెందిన బయోలాజికల్ రిసెర్చ్ సెంటర్ ఆచార్య లాసజోల్ సజ్బదోస్ మాట్లాడుతూ ప్రతి అవకాశాన్ని వదు లుకోవద్దని, సమస్యలపై కాకుండా పరిషారాలపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్ఐటీ ఆచార్య పోరిక రామ్లాల్ మాట్లాడుతూ అంగవైకల్యం దేనికి అడ్డంకి కాదని, లక్ష్యం పెద్దగా ఉండాలన్నారు, లక్ష్య సాధనలో వచ్చే అవరోధాలకు భయపడ వద్దని, తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, ఎలా తన లక్ష్యాన్ని చేరుకున్నది వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ టీ శ్రీనివాసరావు, క్యాంపస్ కాలేజీ ప్రిన్సిపాల్ సురేశ్లాల్, విశ్వవి ద్యాలయ వికలాంగుల సంఘ అధ్యక్షుడు సాంబ శివరావు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశో ధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.