వరంగల్, జనవరి 20(నమస్తేతెలంగాణ): జిల్లాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా జరుగుతున్న మండ లంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి అక్రమ సంపాద నే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. ఈ మండలంలోని గ్రా మాల్లో ఉన్న వ్యవసాయ భూములను రియల్టర్లు పోటీ పడి కొనుగోలు చేస్తుండడంతో సదరు అధికారి తన వసూళ్ల పర్వాన్ని కొనసాగించారు. రియల్టర్లు తాము కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని ఈ అధికారి సహకారంతో కన్వర్షన్ చేసుకుని ప్లాట్లుగా అమ్ముతు న్నారు. ఈ దందాలో అధికారి రియల్టర్ల నుంచి రూ. లక్షలు స్వీకరించినట్లు, రియల్టర్ల ప్రతిపాదనలనే అమ లు చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో బయటప డుతున్నట్లు తెలిసింది.
మచ్చుకు కొన్ని ఉదాహరణలు
ఇక్కడ రియల్టర్ల పోటీతో గ్రామాల్లోని వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగింది. ఒక్కో ఎకరానికి రూ. 3 కోట్ల నుంచి రూ.4 కోట్ల ధర పలుకుతున్నది. రియ ల్టర్లు రైతుల వద్ద ఈ వ్యవసాయ భూములను కొని వెంచర్లు చేస్తున్నారు. వీటిలో 150, 200, 300 చద రపు గజాల చొప్పున ప్లాట్లను ఏర్పాటు చేసి విక్రయి స్తున్నారు. ఈ భూముల కొనుగోలు, విక్రయంలో రియల్టర్లు స్థానిక రెవెన్యూ అధికారి హెల్ప్ తీసుకు న్నారు. ఓ గ్రామం వద్ద ఒక రైతుకు పది ఎకరాల వ్యవ సాయ భూమి ఉంటే ఇందులో రియల్టర్ ఒకరు రెండె కరాలు కొనుగోలు చేశాడు. సదరు రైతు ఈ రెండు ఎక రాలను కొనుగోలు చేసిన వ్యక్తి పేర రెవెన్యూ కార్యా లయంలో రిజిస్ట్రేషన్ చేశాడు. రెవెన్యూ అధికారి ఈ రైతుకు పట్టాదారు పాసు పుస్తకం నుంచి రెండు ఎకరా లు తొలగించి కొనుగోలు చేసిన వ్యక్తికి రెండు ఎకరాల కు పట్టాదారు పాసు పుస్తకం జారీ చేశారు. ఇదే సమ యంలో ఈ రెండు ఎకరాలను నాలా కన్వర్షన్ చేశారు. ఈ పనిచేసినందుకు రెవెన్యూ అధికారి రియల్టర్ నుంచి అక్షరాలా రూ.6 లక్షలు తీసుకున్నారు. సదరు రియల్ట ర్ ఈ రెండు ఎకరాల్లో ప్లాట్లు చేసి గజం చొప్పున అమ్మేశాడు. ఇలా ఒకటి రెండు కాదు పలు గ్రామాల వద్ద వ్యవసాయ భూములను కొని నాలా కన్వర్షన్ చేసు కున్న రియల్టర్ల వద్ద ఒక్కో కన్వర్షన్కు రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు రెవెన్యూ అధికారి ముడుపు లు పుచ్చుకున్నాడు.
అంతేకాదు వ్యవసాయ భూముల ను కొని ప్లాట్లుగా చేసి అమ్మిన తర్వాత వాటిని కొనుగో లుదారులకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో నాలా కన్వ ర్షన్ చేసి ప్లాట్ల వారీగా డబ్బు వసూలు చేశాడు. ఓ గ్రామం వద్ద వ్యవసాయ భూమిలో నలబై ప్లాట్లు చేసిన ఓ రియ ల్టర్ వద్ద సదరు అధికారి వీటి రిజిస్ట్రేషన్ సమయంలో నాలా కన్వర్షన్ చేసినందుకు ఒక ప్లాటుకు రూ.2 లక్షలు గుంజినట్లు తెలిసింది. వ్యవసాయ భూ ముల్లో రియల్టర్లు యాభై గజాలతో అమ్మిన ప్లాట్లకు కూడా ఈ అధికారి ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా పట్టాదా రు పాసు పుస్తకాలు ఇచ్చి నాలా కన్వర్షన్ చేశారు. ఇంత టితో సరిపెట్టుకో కుండా తాను చెప్పిన రియల్టర్కు భూ మి విక్రయించకుండా మరొకరికి అమ్మారని ఒక రైతు కు చెందిన రెండు ఎకరాల భూమిని అన్నీ ఉన్నప్ప టికీ రిజిస్ట్రేషన్ చేయకుండా కొర్రీలు పెట్టినట్లు కూడా ఉన్న తాధికారుల దృష్టికి వచ్చింది. తనకు ముడుపులు ఇవ్వ ని ప్రజల పనులు చేయకుండా వారిని రెవెన్యూ కార్యా లయం చుట్టూ తిప్పుకోవడం ద్వారా వారిని ఇబ్బందు లకు గురి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ అధికారిపై బదిలీ వేటు పడింది. తమకు ఫిర్యాదులు అందిన దృష్ట్యా సదరు అధికారి ఇక్కడ పనిచేసిన సమయంలో జరిగిన భూ ముల రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల జారీ, నాలా కన్వర్షన్లపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.