రాయపర్తి, ఫిబ్రవరి 13 : పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీసీఈబీ కార్యదర్శి జీ కృష్ణమూర్తి సూచించారు. మండలంలోని కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహిస్తున్న పదో తరగతి విద్యార్థుల ఓరియంటేషన్, మోటివేషన్ తరగతులను సోమవారం డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూ ర్తి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదో తరగతి ప్రశ్న పత్రం 11 పేపర్లకు గాను ఆరు పేపర్లకు కుదించినట్టు ఆయన చెప్పారు. నూతన ప్రశ్నపత్రంపై భ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్న పత్రం వస్తుందన్నారు. మోడల్ ప్రశ్నపత్రాల ఆధారంగా విద్యార్థులు ప్రిపేర్ కావాలన్నారు. జిల్లాలో 13 మండలాల్లోని 44 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని ఓరియెంటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లా స్థాయిలోని విషయ వారి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి అదే ఉపాధ్యాయులతో కాంప్లెక్స్ స్థాయిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీజీఈ డీసీపీ నరసింహారావు, ఎంఈవో నోముల రంగయ్య, నోడల్ అధికారి జీ లింగారెడ్డి, వెంకటయ్య, సీహెచ్ శ్రీధర్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి
చెన్నారావుపేట : పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలని ఎంఈవో రత్నమా ల సూచించారు. సోమవారం మండలంలోని మోడల్ స్కూల్లో జల్లి, పాపయ్యపేట కాంప్లెక్స్ పరిధిలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు పదో తరగతి పరీక్షలపై అవగాహన సదస్సును నిర్వహించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సరళ, పాపమ్మ, ప్రధానోపాధ్యాయులు ప్రసన్నా లక్ష్మి, శేఖర్, రవి, కిశోర్, వీరబాబు, పరమేశ్వర్, జగన్మోహన్, బాలాజీరావు పాల్గొన్నారు.
విద్యార్థులు మంచి గ్రేడ్తో ఉత్తీర్ణులు కావాలి ‘పది’తో ఉత్తమ ఫలితాలు సాధించాలి
కరీమాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన సూచించారు. సోమవారం రంగశాయిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గుండు పూర్ణచందర్, జిల్లా విద్యాశాఖ జిల్లా కామన్ పరీక్ష బోర్డు కార్యదర్శి కృష్ణమూర్తి, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్లో..
ఖిలావరంగల్: శివనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. ప్రశ్న పత్రాల సరళిపై విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. అనంతరం పరీక్షల్లో భయం పోగొట్టి విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం కల్పించేలా ఉపాధ్యాయుడు పోగు అశోక్ ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.