నయీంనగర్, జూన్ 13: మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, వారి కోసం విప్లవాత్మక పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాసర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేశారు. అంతకు ముందు మహిళలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సాధికారతకు పెద్దపీట వేశారన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు.
అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా సీఎం కేసీఆర్ కాపాడుకుంటున్నారన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా వీ-హబ్, మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించి దేశంలోనే విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం అని పొగిడారు. కేసీఆర్ కిట్లను 13,90,636 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశామని, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లతో 6.84 లక్షల మంది గర్భిణులకు లబ్ధి చేకూరిందన్నారు. అమ్మఒడి పథకం ద్వారా 18,46,635 మందికి లబ్ది జరిగిందన్నారు. అన్ని రంగాల్లో మహిళాలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
గుకెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చారన్నారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు పారితోషికాల పెంపు, మహిళా భద్రతకు చర్యలు, షీ టీమ్స్, భరోసా, సఖీ కేంద్రాలు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అనంతరం పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచి న మహిళా అధికారులకు శాలువా కప్పి, ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, మైనార్టీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ మధురిమ, మైనా ర్టీ ఈడీ శ్రీనివాస్, మెప్మా పీడీ భద్రునాయక్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.