ఖిలావరంగల్ : ప్రభుత్వం నిషేధించిన గుట్కాల విక్రయాలకు పాల్పడుతున్న నలుగురిని వరంగల్ టాస్క్పోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గుట్కాలు స్వాధీనం చేసుకుని మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించారు. టాస్క్పోర్స్ సీఐ సంతోష్, సీహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శివనగర్కు చెందిన వెంశెట్టి విశ్వనాథం గుట్కాలు రవాణాతో పాటు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం రావడంతో ఆయన ఇంటిపై దాడులు చేశారు. దాడులు నిర్వహించగా రూ. 3,01,200లు విలువ కలిగిన జేకే జర్ధ, జర్ధా, ఆర్ఆర్ఆర్, అంబర్, ఎన్పీఓ జర్ధ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
గుట్కాలు రవాణ చేస్తున్న విశ్వనాథంతో పాటు కేసముద్రంకు చెందిన గుంటూరు సోమయ్య, మహబూబాబాద్కు చెందిన శ్రీనివాస్, పడిగల వెంకన్నను అదుపులోకి తీసుకుని మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించినట్లు సీఐలు తెలిపారు.