స్టేషన్ఘన్పూర్, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని నమిలిగొండ గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 960 గురుకులాలు, వసతి గృహాల్లో సన్నబియ్యంతో నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ దీటుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. నిరుపేదలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకులాల్లోని ప్రతి విద్యార్థిపై రూ.లక్షా 20వేలు ఖర్చు చేస్తున్నదన్నారు.
జఫర్గఢ్ నుంచి కస్తూర్బా పాఠశాల వరకు సీసీ రోడ్డు, మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన గది నిర్మాణం కోసం రూ.పది లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే కస్తూ ర్బా పాఠశాలలో గ్రౌండ్ లెవలింగ్ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ రేణుక, సర్పంచ్ డ్యాగల ఉప్పలస్వామి, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖాగట్టయ్య, ఎంపీడీవో కు మారస్వామి, ఉప సర్పంచ్ రాంచందర్, గ్రామఅధ్యక్షుడు హరికిషన్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జ్ లకావత్ చిరంజీవి, కార్యనిర్వాహక మండల ఇన్చార్జ్ అనిల్, మండలాధ్యక్షుడు బొంకూరి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రహరీ నిర్మాణం..
చిల్పూరు : మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో రూ. 5 లక్షల సీడీఎఫ్ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ భవన ప్రహరీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ కేసిరెడ్డి ప్రత్యూషామనోజ్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేషంలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారన్నారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ రంగు రమేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రంగు హరీశ్, ఎంపీటీసీ మారబోయిన ఐలమ్మ, ఎంపీపీ బొమ్మిశెట్టి సరితాబాలరాజు, సాగునీటి సాధన కమిటీ కన్వీనర్ కేశిరెడ్డి మనోజ్రెడ్డి, మండలాధ్యక్షుడు భూక్యా రమేశ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పోలెపల్లి రంజిత్రెడ్డి, బాలరాజు, వెంకటస్వామి, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు, మార్కెట్ కమి టీ డైరెక్టర్లు రాజన్బాబు, శ్యామ్సుందర్రెడ్డి, మండల మాహిళ అధ్యక్షురాలు శ్రీరాముల రజి త, మాజీ సర్పంచ్ కొయ్యడ రామ్దాస్, గ్రామ యుత్నాయకలు మోతె రజినీకాంత్, గడ్డం అజ య్, టేకులపల్లి సిద్ధిబాబు పాల్గొన్నారు.