హనుమకొండ చౌరస్తా, మే25: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నేడు, రేపు టీఎస్ ఐసెట్-2023 నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పీ వరలక్ష్మి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(ఎంపిక చేసిన కేంద్రాల్లో) పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఐసెట్కు మొత్తం 75, 932 మంది హాజరు కానుండగా, ఇందులో పురుషులు 37112 మంది, మహిళలు 38815, ఐదుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరిలో 4450 మంది ఉర్దూ మాధ్యమం ఎంపిక చేసుకో గా, 325 మంది దివ్యాంగులు ఉన్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు.
ప్రవేశ పరీక్ష 26, 27 తేదీల్లో రెండు సెషన్లలో ఒకటి ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల మధ్య జరుగనున్నట్లు తెలి పారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రం వెంట తీసుకురావాలని, ఉదయం సెషన్ అభ్యర్థు లు ఉదయం 8.30 నుంచి, మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులు 1 గంట నుంచి సెంటర్లకు అనుమతి స్తారని వివరించారు. ఒక నిమిషం నిబంధన అ మలులో ఉన్నట్లు, మరిన్ని వివరాలకు టీఎస్ ఐసెట్ వెబ్సైట్ చూడాలని కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి తెలిపారు.