జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహిస్తున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్ల్లు ఎస్పీ జె.సురేందర్రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆదివారం జరిగే కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పరిధిలో 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, 4,755 మంది హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని తెలిపారు.
బయోమెట్రిక్ హాజరు విధానం
పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను గుర్తించేందుకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటారని, పరీక్ష సమయానికి గంట ముందే (ఉదయం 9గంటలకు) పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఎస్పీ తెలిపారు. చేతులకు గోరింటాకు, మేహందీ వంటివి పెట్టుకుంటే బయోమెట్రిక్లో వేలిముద్రలు గుర్తించే అవకాశం ఉండదని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని వివరించారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. ఇప్పిస్తామనే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని ఎస్పీ సూచించారు.