ఖిలావరంగల్, నవంబర్ 4 : ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేసి పరకాల నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. శనివారం గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో కాగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత, మత రాజకీయాలు నచ్చకనే ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో పసునూరి కుమారస్వామి, ఎల్లయ్య, రాజు, దయాకర్, పుచ్చ రాజు, గజవెళ్లి ధనుంజయ, నవీన్, ఎస్ అవీఫ్, అరుణ్, బాబు, నవనీత్, వరప్రసాద్, ఏలియా, ఇమాన్యుయేల్, పుచ్చ బాబు, బొజ్జం సదానందం, గట్టికొప్పుల గంగులు, బొజ్జం సంజీవకుమార్, చవ్వా కుమారస్వామి ఉన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గద్దె బాబు, సొసైటీ వైస్ చైర్పర్సన్ సోల్తీ భూమాత పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రం అంధకారమవుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఆరెపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి శనివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక పంటలు పండక రైతుల వలసలు పోయారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలను దోచి పెద్దలకు పెడుతోందన్నారు. ఆ రెండు పార్టీలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందన్నారు. తొమ్మిదేండ్లలో పరకాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరింతా అభివృద్ధి చేస్తానన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు తుమ్మనపల్లి బాబురావు, నాయకులు మోటం స్వామి, మంద భిక్షపతి, ముదిరాజ్ సంఘం కార్యదర్శి పెండ్యాల సతీశ్ ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, గ్రామ అధ్యక్షుడు సిందె విజయ్, కార్యదర్శి తుమ్మనపల్లి నరేశ్, ఉప సర్పంచ్ కమలాకర్, నాయకులు కోట రఘుపతిరెడ్డి, సురేశ్ పాల్గొన్నారు.