నర్సంపేట రూరల్ : అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని నిరుపేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ. 4లక్షల విలువ చేసే ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఎంతోమంది పేద ప్రజలు ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించని అనేక రోగాలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్వోసీల ద్వారా వైద్య సేవలను పొందవచ్చన్నారు.
నర్సంపేట మండలంలోని భాంజీపేట గ్రామానికి చెందిన వి. వినీత్కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 4లక్షల విలువ గల ఎల్వోసీని అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుంటి కిషన్, నాగిశెట్టి ప్రసాద్, భీరం సంజీవరెడ్డి, జున్నుతుల మహేందర్రెడ్డి, మురారీ రవి, దేవోజు సదానందం, గంధం జగన్మోహన్రావు తదితరులు ఉన్నారు.