Gruhalakshmi | ములుగు, మార్చి10 (నమస్తేతెలంగాణ) : ‘నా కొడుకును కరోనా ఎత్తుకపోయింది.. మా ఆయినె మంచాన పడ్డడు. తెలంగాణ గౌర్మెంటు ఇస్తున్న పింఛినితోనే బతుకుతున్నం. మాకు కొంత భూమున్నది. అండ్లనే రేకులేసుకొని ఉంటున్నం. జాగున్నోళ్లు ఇల్లుకట్టునేటందుకు తెలంగాణ గౌర్మెంటు పైసలిస్తదట.. కేసీఆర్ అన్నడంటే తప్పకుండ ఇస్తడు’ అంటూ సంతోషపడుతున్నది ఈ అరుణమ్మ..
ప్రతి మనిషికీ కూడు, గుడ్డ, నీడ చాలా అవసరం. ఇప్పటికీ సొంతిల్లు లేక ఎందరో నిరుపేదలు పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన సీఎం కేసీఆర్ వారికి గూడునివ్వాలని సంకల్పించి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి అందించారు. సొంత స్థలం లేనివారికి డ బుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వడమే కాకుం డా, స్వస్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామని ప్రకటించి కార్యాచరణను రూపొందిస్తున్నారు. పేదలకు సొంతిటి కలను త్వరగా తీర్చేందుకు ‘గృహలక్ష్మి’ పథకంతో ముందుకొచ్చారు. త్వరలోనే ఈ పథకం అమలవుతుందని తెలిసి ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ కాలనీకి చెం దిన పున్నం అరుణమ్మ-ఓదెలు దంపతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు.
గుంట భూమి ఉన్నా ఇల్లు కట్టుకోలేక 15చదరపు అడుగుల్లో ఇటుక గోడలు, రేకుల ఇంటిలో వీరు సంసార సాగరాన్ని ఈదుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గృహలక్ష్మి పథకంతో తాము సొంత ఇల్లు కట్టుకుంటామని భరోసా వ్యక్తం చేస్తున్నారు. తమ ఒక్కగానొక్క కొడుకు ప్రకాశ్ను కరోనా కాటు వేసి వారికి కడుపుకోత విధించింది. కొడుకు చావుతో తీరని దుః ఖంతో ఓదెలు మంచానపడగా వారికి ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్ ఎంతో ఆధారమైంది. దీంతో పాటు అరుణమ్మ తన కోడలితో కలిసి కూలికి వెళ్తూ వచ్చే సంపాదనతో ఇద్దరు మనుమళ్లు, మనుమరాలిని సాకుతున్నది. ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ సొం తింటి కల త్వరలోనే నెరవేరుతుందన్న ఆశాభావంతో తన ఆనందాన్ని ‘నమస్తేతెలంగాణ’తో పంచుకుంది.
మేము నలభై ఐదేండ్ల సంది ఈ జాగలనే ఉంటున్నం. రేకుల ఇల్లే మాకు ఇంత కాలం దిక్కైంది. నా భర్త వ్యవసాయ కూలీ. పానం మంచిగ లేక 25ఏండ్ల కానుండెల్లి ఇంటికాన్నే ఉంటాండు. ముసలోళ్ల ఫించన్ కోసం ఏండ్లకేండ్లు తిరిగినా అప్పటి రాజకీయ నాయకులు ఇయ్యలే. తెలంగాణ వచ్చినంకనే నా భర్తకు ఆసరా పింఛిని కింద రూ.2016 వస్తున్నయ్. అవి ఇంట్లో ఎంతో అక్కెరకస్తున్నయ్. నేను సుత కూలీ పనులకు పోయి ఎల్లదీస్తాన. ఇప్పుడు వయసు మీద పడింది. కొడుకు ఇల్లు కడుతడు అనుకుంటే పాడు రోగం కరోనా సంపింది. ముసలితనంల ఇల్లెట్ల కడుతం.. ఇది కాని ముచ్చట అనుకున్నం. ఇప్పుడు కేసీఆర్ సారు గృహలక్ష్మి పథకం పెడుతండని నా మనువడు చెప్పిండు. జాగునోళ్లకు ఇల్లు కట్టుకునేందుకు పైసలిస్తరట.. తెలంగాణ ప్రభుత్వం ఇస్తదని నమ్మకముంది. జాగ ఉండి ఇల్లు లేని మా అసోంటి పేదోళ్లకు ఈ పథకం లక్ష్మిగళ్ల పథకం. – పున్నం అరుణమ్మ