అందరి ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో చేపట్టనున్న కంటి వెలుగు -2 కార్యక్రమంపై హనుమకొండ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంధత్వ నివారణ కోసం చేపట్టిన కంటి వెలుగును కలిసికట్టుగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డాక్టర్లను నియమించి ఈ కార్యక్రమం చేపడుతున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామాల్లో శిబిరాలు నిర్వహించాలని సూచించారు. వంద రోజుల ఈ కార్యక్రమం గురించి ప్రతి గ్రామం, పట్టణంలో బోర్డులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ప్రజలందరూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.
హనుమకొండ, జనవరి 5 : అందరికీ ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని,అందులో భాగంగా రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో చేపట్టనున్న కంటి వెలుగు -2 కార్యక్రమంపై హనుమకొండ కలెక్టరేట్లో సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ
కలిసికట్టుగా పనిచేసి కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగు -2 కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు.
ఈ కార్యక్రమంపై ఇటీవల హైదరాబాద్లో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తాను సైతం పాల్గొన్నట్లు మంత్రి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ దీనిని పట్టుదలతో చేపట్టారని తెలిపారు. మొదటి దశ విజయవంతమైందని అన్నారు. పింఛన్లకు వచ్చిన దాని కంటే కంటి వెలుగుకు పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు. దేశంలో ఎక్కడా ఇంతటి గొప్ప కార్యక్రమం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డాక్టర్లను నియమించి ఈ కార్యక్రమం చేపడుతున్నారని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రతి గ్రామంలో కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామ,మండల సమావేశాలను ఎంపీపీలు, అధికారులు కలిసి ఏర్పాటు చేసుకోవాలని, ఏ రోజు ఎకడ కార్యక్రమం నిర్వహిస్తారు, ఎవరు దేనికి బాధ్యత వహించాలో కార్యాచరణ రూపొందించాలన్నారు.
శిబిరాలు జరిగే రోజు సర్పంచ్, కార్యదర్శి, సఫాయి కార్మికులు అందరూ అక్కడే ఉండాలని ఆదేశించారు. అలాగే, శిబిరాల్లో అవసరమైన వసతులు కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు తమదిగా భావించి విజయవంతం చేయాలని సూచించారు. వంద రోజుల కార్యక్రమం గురించి ప్రతి గ్రామం, పట్టణంలో బోర్డులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని అన్నారు. బుక్లెట్లలో కార్యక్రమం పూర్తి వివరాలు ఉంటాయన్నారు. శని, ఆదివారాలు మినహాయించి అన్ని రోజుల్లో శిబిరాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఎకడి వారు అకడే బస చేయాలని, పని చేసే వారికి రూ.1500 ఇస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఫెయిలైతే ప్రజాప్రతినిధులు, అధికారులూ ఫెయిల్ అయినట్లేనని మంత్రి అన్నారు. ముందే భోజనాలు, మౌలిక సదుపాయాలు, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇందుకోసం శిబిరాలు జరిగే ప్రాంతాలకు వెళ్లి పర్యవేక్షించాలని కోరారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు.
జిల్లాలకు ఇప్పటికే వచ్చిన రీడింగ్ గ్లాసెస్ చాలా బాగున్నాయన్నారు. మిగిలిన వారికి పరీక్షలు చేసిన తర్వాత 15 రోజుల్లో అద్దాలు వస్తాయని, అన్ని మందులు ఇస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, వొడితల సతీశ్కుమార్, అరూరి రమేశ్, రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, వరంగల్