మహబూబాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు త్వర లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి జిల్లా కేంద్రంలోని మంత్రి సత్యవ నివాసంలో సమీక్ష చేశారు. నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయం, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, మెడికల్ కళాశాల ప్రారంభోవత్స వం, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నా రు. సీఎం పర్యటన తేదీలు త్వరలో ఖరారు కానున్నాయని, వీలైనంత త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అనంతరం మంత్రి సత్యవతి తన నూతన నివాసంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నిర్వహించగా మంత్రి ఎర్రబెల్లి హాజరై స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీచైర్పర్సన్ అంగోత్ బిందు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తాత మధు, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, తాటికొండ రాజయ్య, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాంమోహన్రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, కురవి జడ్పీటీసీ వెంకట్రెడ్డి, నాయకులు శ్రీరంగారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్రెడ్డి, బీరవెల్లి భరత్కుమార్రెడ్డి, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్, ఎస్పీ శరత్చంద్రపవార్ తదితరులు పాల్గొన్నారు.