మహబూబాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్తో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి సత్యవతి మాట్లాడా రు. రైతుబంధు పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంపై రైతులపై వారికి ఏ మేర ప్రేమ ఉం దో అర్థమవుతోందన్నారు. యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యా దు చేయడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించా రు. రైతులకు 3 గంటల కరెంటు కావాలన్న కాంగ్రెస్ కావాలో.. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నా రు.
రైతుబంధును అడ్డుకునేలా కుట్రలు చేస్తు న్న హస్తం పార్టీని బొందపెట్టాలన్నారు. కర్ణాటక తరహాలో ఇకడ ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని, కన్న డ రైతులు కొడంగల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక హామీని నిలుపుకోలేదని, ముందు ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో గ్యారెంటీ ఇవ్వాలన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అనే క్లారి టీ మీకే లేనప్పుడు మీ గ్యారెంటీలను ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి కాంగ్రెస్ డిక్లరేషన్ పేరుతో ప్రకటించిందన్నారు. గత ఎన్నికల మాదిరిగానే బీజేపీకి 100 స్థానాల్లో డిపాజిట్లు వస్తే మహా ఎకువ అని అన్నారు. మేము అభ్యర్థులను ప్రకటించి ప్రజాక్షేత్రంలో ముందున్నామని, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం సీట్ల కోసం కొట్లాడుకుంటున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు సీట్లు పంచుకునేలోగా మేము స్వీట్లు పంచుకోవ డానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సాగు, తాగు, సంక్షేమ రంగాలను సమానంగా అభివృ ద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందన్నారు. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా కీలక సంక్షేమ పథకాలను కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారన్నారు. మహబూబాబాద్ జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశామని, ఇంకా అనేక అభివృద్ధి పనులు కొన సా గుతున్నాయని వివరించారు. పదేళ్లకు ముం దు మానుకోట, ఇప్పటి మానుకోటకు ఉన్న వ్యత్యా సం మనం కళ్ల ముందు చూస్తున్నామన్నారు.
పథకాల లబ్ధిదారులంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని, సీఎం కేసీఆర్ను మరోసా రి ఆశీర్వదించి, శంకర్నాయక్ను మూడోసా రి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. రైతుల కష్ట నష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ పెట్టుబడి సా యాన్ని దశల వారీ గా 16వేలకు పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించ డం గొప్ప విషయమన్నారు. కేసీఆర్కు మానుకోటపై ప్ర త్యేక ప్రేమ ఉందని, నేడు అభివృద్ధిలో మహబూబాబాద్ దూసుకుపోతోందన్నారు. మానుకోట ప్రజలు మేధావులు, విద్యావంతులు, యు వకులు, మహిళలు, వ్యాపారులు ఆలోచించాల ని కోరారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు మహబూబాబాద్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కు 70 వేల మంది హాజరు కానున్నారని, అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటికొకరు చొప్పున పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి నూకల నరేవ్రెడ్డి, బీరవెల్లి భరత్ కుమార్ రెడ్డి, మహబూబ్ పాషా, మర్రి రంగారావు, పరకాల శ్రీనివాస్రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.