హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 14: ఎంతో మంది ప్రాణ త్యాగాలతో మనకు స్వాతంత్రం వచ్చిందని, వారి త్యాగాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో జానపద కళా ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కళాకా రులకు అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారని అన్నారు. జానపద కళాకారులతో మన సంస్కృతి, విలువలు పెరుగుతాయని అన్నారు. యువతలో స్ఫూర్తినింపేందుకే స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జేఎన్ఎస్ మైదానంలో పటాకులు కాల్చారు.
అలరించిన కళాకారుల ప్రదర్శనలు..
కళాకారుల నృత్యప్రదర్శనలు అలరించాయి. జానపద పాటలకు నృత్యాలు చేస్తూ ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. ఆదివారం సెలవు కావడంతో వర్షంలోనూ తిలకించేందుకు ప్రజలు తరలివ చ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.