కరీమాబాద్/కాశీబుగ్గ/గిర్మాజీపేట, ఆగస్టు 5: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బర్త్డే వేడుకలు శనివారం వరంగల్లో వాడవాడలా జరిగాయి. మాజీ కార్పొరేటర్ నాగపురి కల్పన-సంజయ్బాబు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తవక్కల్ వెల్ఫేర్ ట్రస్టు చైర్మన్ ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో మైనారిటీ నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మహబూబ్ జానీ, హసన్అలీబేగ్, దస్తగిరి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే, పోచమ్మమైదాన్ జంక్షన్లో మావూరపు విజయభాస్కర్రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
అంతేకాకుండా పెరికవాడ బొడ్రా యి వద్ద బీఆర్ఎస్ నాయకుడు వడ్డె కోటేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే తనయుడు లోకేశ్పటేల్ హాజరై భారీ కేక్ను తల్వార్తో కట్ చేశారు. అనంతరం డివిజన్ ప్రజలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎం అరుణ-సుధాకర్ దంపతులు, వడ్డె శ్రీమాన్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మీరిపెల్లి వినయ్కుమార్, కుడా డైరెక్టర్ ప్రవీణ్, మార్త రాజు, అప్పని కృష్ణ, గోపు శ్రీనివాస్, కర్నీ ప్రభాకర్, వల్లెపు సాంబయ్య, దాసు, వంగరి రమేశ్, బెస్త ప్రసాద్, కుమార్, మోహన్, ఆనంద్, నిఖిల్ పాల్గొన్నారు.